ఈ తల్లిదండ్రులు చేసిన పని పేరెంట్స్ జాతికే మచ్చ తీసుకొచ్చారు. అయితే ఈ తల్లిదండ్రులు ఏం చేశారు అనుకుంటున్నారా.. కన్నబిడ్డను వ్యభిచారం చేయమని తల్లిదండ్రులు బలవంతం చేసిన అత్యంత దారుణమైన ఘటన మధ్యప్రదేశ్‌ లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బాంచా సామాజికవర్గానికి చెందిన యువతి నీముచ్‌ కుక్‌దేశ్వర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మోయా గ్రామానికి చెందిన ఓ యువకుడిని ప్రేమించింది. ఆ యువతి అతడిని పెళ్లి చేసుకోవాలని అనుకుంది.

అయితే ఈ విషయం తెలిసిన యువతి తల్లిదండ్రులు ఆమెపై వ్యభిచారం చేయమని ఒత్తిడి తీసుకొచ్చాడు. దీంతో యువతి తల్లిదండ్రుల మాటను యువతి ఎంత తిరస్కరించినప్పటికి వాళ్లలో దుర్మార్గం మరింత పెరిగిపోవడంతో వేరే దారిలేక ఆ యువతి కన్నతల్లిదండ్రులతో పాటు మేనమామ బండారాన్ని బట్టబయలు చేసింది. ఇక నచ్చిన యువకుడితో కలిసి తనకు జరుగుతున్న అన్యాయాన్ని ఫోన్‌లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

ఆ యువతీ సోషల్ మీడియాలో ఈ విధంగా చెప్పుకొచ్చింది. ఇక యువతి తనకు ప్రాణహాని ఉందని..వ్యభిచారకూపంలోకి కన్నవాళ్లే నెట్టాలని చూస్తున్నారని వేడుకుంటున్న వీడియో చేప్పింది. ఈ వీడియో నీముచ్‌ పోలీసుల దృష్టికి రావడంతో కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం పోలీసులు యువతి, యువకుల వివరాలు సేకరించి వారితో మాట్లాడి వివరాలు సేకరించారు. వారిద్దరికీ వివాహం చేసి వాళ్ళను రక్షించాలని పోలీసులను వేడుకున్నారు.

మరోవైపు యువతి తల్లిదండ్రులు చెప్పినట్లుగా వినడం లేదని చివరకు ఆమె ప్రేమిస్తున్న యువకుడి ఇంటిని ధ్వంసం చేసి వాళ్ల కుటుంబ సభ్యులను వేధింపులకు గురి చేశారని తెలిపారు. అంతేకాదు.. తాను ఒక్కదాన్నే కాదు బాంచా సామాజికవర్గానికి చెందిన చాలా మంది అమ్మాయిలను వారి తల్లిదండ్రులు ఇలాగే మురిసి కూపంలోకి నెట్టాలని చూస్తున్నట్లు ఆమె చెప్పుకొచ్చింది. వారిని రాక్షసుల చెర నుంచి విముక్తి కలిగించాలని ఆమె వేడుకుంది. యువతీ చెప్పిన విషయాలపై నిజనిర్దారణ చేసుకొని వారి తల్లిదండ్రులు మేనమామపై చర్యలు తీసుకుంటామని చెప్పుకొచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: