ఒకప్పుడు భర్తలు మమ్మల్ని ఎంతగానో వేధిస్తున్నారు అంటూ మహిళలు పోలీసులను ఆశ్రయించిన ఘటనలు ఎన్నో  వెలుగు లోకి వచ్చాయి. కానీ ఇటీవలి కాలంలో మాత్రం భార్య చిత్రహింసలకు గురి చేస్తోంది అంటూ ఎంతో మంది భార్యా బాధితులు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసిన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అంతే కాకుండా ఇంకా ఎంతోమంది భార్య వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకోవడం లాంటి వి కూడా చేస్తున్నారు. ఇక్కడ ఓ వ్యక్తి ఇలాంటిదే చేశాడు. నమ్మండి నా చావుకు నా భార్య అత్త మామ బావ మరదలు కారణం అంటూ సూసైడ్ నోట్ రాసి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఘటన స్థానికంగా హాట్ టాపిక్ గా మారిపోయింది. మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది..



 బడంగ్పేట్ కి చెందిన  శ్రవణ్ కుమార్ జనగామ కు చెందిన రవలిని 2019 ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నాడు. వీరికి రెండున్నరేళ్ల కూతురు కూడా ఉండడం గమనార్హం. మొన్నటి వరకు ఎంతో అన్యోన్యంగా ఉన్న దంపతుల మధ్య ఇటీవల కాలంలో తరచూ గొడవలు జరగడం మొదలయ్యింది. ఈ క్రమంలోనే భార్య రవళి పుట్టింటికి వెళ్లిపోయింది. ఇక భార్యను తీసుకు రావడానికి భర్త శ్రవణ్ తన కుటుంబ సభ్యులతో కలిసి అత్తారింటికి వెళ్లాడు. అక్కడ రవళి బంధువులు sravan KUMAR' target='_blank' title='శ్రవణ్ కుమార్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>శ్రవణ్ కుమార్ అతని కుటుంబ సభ్యులతో గొడవకు దిగారు. ఆ తర్వాత కొన్ని రోజులకు రవళి అత్తారింటికి వచ్చింది.


 ఇక మళ్ళీ గొడవ కావడంతో రవళి పుట్టింటికి వెళ్లిపోయింది. ఇక ఇటీవల రవళి తన తల్లిదండ్రులు అన్నదమ్ములతో వచ్చి భర్త శ్రవణ్ తో గొడవ పడి 20 లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్ చేసింది. ఇక బెదిరింపులకు పాల్పడ డంతో sravan KUMAR' target='_blank' title='శ్రవణ్ కుమార్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>శ్రవణ్ కుమార్ తన పేరు మీద ఉన్న ఇల్లు విక్రయించాలని అనుకున్నాడు. ఇలాంటి సమయంలోనే భార్య రవళి భర్తకు మళ్లీ నోటీసులు పంపింది. దీంతో మానసికంగా ఎంతగానో కుంగిపోయాడు  శ్రవణ్ కుమార్. ఇక నా చావుకు భార్య అత్తమామలు కారణం అంటూ సూసైడ్ నోట్ రాసి చివరకు బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: