చిన్నచిన్న కారణాలకే సాటి మనుషుల ప్రాణాలు తీసేస్తూ దారుణంగా హత్య లకు పాల్పడుతున్న ఘటనలు రోజురోజుకీ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. దొంగతనం చేయాలనే ఆలోచన ఆ మహిళను హంతకురాలిగా మార్చింది. అభం శుభం తెలియని చిన్నారిని దారుణంగా హతమార్చింది. సాధారణంగా ఎవరికైనా చిన్నపిల్లలనూ చూస్తే ఎత్తుకుని ముద్దు చేయాలి అని అనిపిస్తూ ఉంటుంది. ఇక చిన్నారులు ఎంతో ముద్దు ముద్దు గా మాట్లాడుతూ ఉంటే చూసి ప్రతి ఒక్కరు మురిసిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక మహిళ మాత్రం దారుణంగా వ్యవహరించింది.
చిన్నారి ప్రాణాలు తీసిన ఈ ఘటన తమిళనాడులో వెలుగులోకి వచ్చింది. 4 ఏళ్ల చిన్నారిని పొరుగున ఉండే ఓ మహిళ దారుణంగా ప్రాణాలు తీసింది. ఫాతిమా అనే మహిళ ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి వచ్చింది. ఇంట్లో చిన్నారి ఒంటరిగా ఉండటం తో ఒంటిపై బంగారాన్ని దొంగిలించింది. ఇక అనంతరం ఆ బాలుడి నోట్లో గుడ్డలు కుక్కి దారుణంగా హతమార్చింది. మృతదేహాన్ని తన ఇంట్లో ఉన్న బీరువాలో దాచేసింది సదరు మహిళ. అయితే ఇక కొడుకు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు కంగారుపడ్డారు. ఈ క్రమంలోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తమదైన శైలిలో విచారణ జరపడం తో అసలు విషయం బయటకు వచ్చింది.