భార్య భర్తల మధ్య తరచూ ఏదో ఒక విషయంలో గొడవలు  జ‌రుగుతుంటాయి. వీటికి కారణాలు మాత్రం ఏమైనా ఉండ‌వ‌చ్చు.  కొన్నిసార్లు  అస‌లు ఊహించడం కూడా కష్టమే.. అయితే ఒక్కోసారి మొబైల్ ఫోన్ కూడా అందుకు కారణం అవుతుంది.  తమ భార్య స్మార్ట్ మొబైల్ వాడడం కొంత మందికి అస‌లు నచ్చదు. కొన్నిసార్లు ఈ విషయంలో చాలా  ఇండ్ల‌లో గొడవలు కూడా జరుగుతూ ఉంటాయి.  తాజాగా ఘటనలో భార్య భర్తల మధ్య గొడవలు జరగడానికి  స్మార్ట్‌ఫోన్ పెద్ద కారణమైంది.  ఈ ఘటన వినడానికి కొంత ఆశ్చర్యంగా అనిపించినా వాస్తవానికి ఇదే జరిగింది.  

ప‌శ్చిమ బెంగాల్లోని కొల్‌క‌తాలో చోటు చేసుకున్న‌ది. కోల్‌క‌తాలోని న‌రేంద్రపూర్‌లో 40 ఏళ్ల వ్య‌క్తి  తన భార్యతో నివసిస్తున్నాడు .కొన్ని నెలల క్రితకు తనకు కొత్త  స్మార్ట్‌ఫోన్ కొనివ్వాల‌ని భ‌ర్త‌ను భార్య కోరింది. ఈ విష‌యంలో అనేక సార్లు భ‌ర్త‌ను రిక్వెస్ట్ చేసింది. అయితే భార్య‌కు స్మార్ట్ ఫోన్ కొనివ్వ‌డం ఆమె భ‌ర్త‌కు ఇష్టం లేదు. దీంతో ఆ తర్వాత అనేక ఇబ్బందులు వస్తాయి అన్నది అతడి ఆలోచన. అందుకే భార్య ఎన్నిసార్లు స్మార్ట్ ఫోన్ కొని ఇవ్వాలని అడిగినా  అతడు మాత్రం స్పందించలేదు.  ఎప్పటికప్పుడు మొబైల్   ఇందుకు నిరాకరించాడు.  చివరకు తాను స్మార్ట్ ఫోన్ కొన్ని ఇవ్వబోనని ఈ విషయం మళ్లీ పదేపదే అడగొద్దు భార్యకు వార్నింగ్ ఇచ్చాడు.  అప్పటి నుంచి వారిద్దరి మధ్య గొడవలు  ప్రారంభ‌మ‌య్యాయి.  తాను ఎంత కోరిన భర్త ఫోన్ కొని ఇవ్వకపోవడంతో,  అతడి భార్య కొంచెం బాధ పడింది.

స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాల‌నే ఆమె కోరిక మాత్రం అదేవిధంగా ఉండిపోయింది. ఎలాగైనా ఫోన్ కొనుగోలు చేయాల‌ని డిసైడ్ అయింది. భ‌ర్త‌ను డబ్బు అడ‌గ‌కుండా భార్య త‌న సంపాద‌న‌తో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసిన‌ది. జ‌న‌వ‌రి 01న భార్య చేతిలో భ‌ర్త‌కు స్మార్ట్ ఫోన్ క‌నిపించింది. కొత్త స్మార్ట్ ఫోన్ రావ‌డంతో సంతోషించిన భార్య‌ను చూసి భ‌ర్త ఆగ్ర‌హంతో ఊగిపోయాడు. ఆమెను స్మార్ట్ ఫోన్ వాడ‌వ‌ద్ద‌ని బెదిరించాడు.  ఈ విష‌యంలో త‌న మాట వినాల‌ని హుకూం జారీ చేసాడు. త‌న మాట విన‌కుంటే చంపేస్తా అని బెదిరించాడు. భ‌ర్త త‌న ఇంటి మెయిన్ డోర్‌కు తాళం వేసి బ‌య‌ట‌కు వెళ్లాడు. కానీ అత‌ను వెంట‌నే తిరిగి రాలేదు.

 ఆ త‌రువాత  భార్య‌కు భ‌ర్త వ్య‌వ‌హారంపై అనుమానం వ‌చ్చిన‌ది. భ‌ర్త‌ను వెత‌క‌డానికి బ‌య‌ట‌కెళ్లింది.  అప్పుడు కొంద‌రూ భార్య‌పై దాడి చేసారు. హంతకుల్లో ఒక‌డు మ‌హిళ మెడ‌పై ప‌దునైన వ‌స్తువుతో దాడి చేయ‌డంతో ఆమెకు తీవ్రంగా ర‌క్త‌స్రావ‌మైంది. మ‌హిళ కేక‌లు వేయ‌డంతో చుట్టుప‌క్క‌ల వారు వ‌చ్చారు.  ప్ర‌జ‌లు ఆమెను ఆసుప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. నిందితుడైన భ‌ర్త‌ను, కిరాయి హంత‌కున్ని ప‌ట్టుకున్నారు. ప‌రారీలో ఉన్న మ‌రొక వ్య‌క్తి కోసం గాలిస్తున్నారు పోలీసులు. భార్య స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయ‌డం భ‌ర్త‌కు ఏ మాత్రం ఇష్టం లేదు అని అందుకే అత‌డు ఈ ర‌క‌మైన దుశ్చ‌ర్య‌కు పాల్ప‌డిన‌ట్టు పోలీసులు వెల్ల‌డించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: