ప్రేమలో పడితే ఏదైనా చేస్తుంటారు. ఇక ప్రేమించిన వ్యక్తి కోసం ఎం చేయడానికైనా సిద్ధం అవుతుంటారు. అంతేకాదు.. తాము ప్రేమించిన వాళ్లు తమకు హాని చేయాలని చూసినా.. వీరికి మాత్రం వారిపై ఉన్న ప్రేమ ఏ మాత్రం తగ్గనివారు. అయితే మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్ జిల్లాకు చెందిన ఓ యువకుడు ప్రేమ కూడా కోణానికి చెందినదే. ఆ వ్యక్తి ప్రేమించింది మరెవరినో కాదు.. స్వయానా అతడి భార్యనే ఇష్టపడ్డాడు. కానీ ఆమెకి మాత్రం అతడిపై ఎలాంటి ప్రేమ లేదు. ఆమె తన భర్తను కాకుండా మరో వ్యక్తిని ప్రేమించింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఛతర్‌పూర్ జిల్లాలోని లవ్‌కుష్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న సంతోష్‌కు భార్య సుధ.. ఇద్దరు సంతానం ఉన్నారు. ఇక ఇక్కడ నివసించే ప్రమోద్‌తో సంతోష్ భార్య సుధతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. వీరిద్దరి సంబంధం గురించి భర్త సంతోష్‌కు తెలియడంతో భార్య మీద ఉన్న ప్రేమతో ఆమెకి నచ్చజెప్పేందుకు ఎంతో ప్రయత్నించాడు. ఆమె అతడి మాట వినకపోవడంతో ఇది సరైన పద్ధతి కాదని నలుగురితో చెప్పించి ఇప్పటికైనా మారాలని ఆమెకు చెప్పాడు.

అయితే సంతోష్ భార్య సుధ మాత్రం తన ప్రియుడి విషయంలో ఏ మాత్రం మనసు మార్చుకోకుండా అలాగే కొనసాగిస్తుంది. అంతేకాదు.. వారిద్దరికీ  భర్త సంతోష్ అడ్డు తొలగించుకోవాలని అనుకుంది. ఈ తరుణంలోనే సంతోష్ తాగే టీలో విషం కల్పించింది. దాంతో సంతోష్ ఆస్పత్రి పాలైయ్యాడు. అయితే ఆస్పత్రిలో చేరినా సంతోష్‌కు మాత్రం భార్యపై ఏ మాత్రం కోపం రాలేదంట. ఇక వారికీ ఇద్దరు పిల్లలు ఉన్నారని.. తనకు ఇప్పటికీ తన భార్యే కావాలంటూ వేడుకున్నారు.

అంతేకాదు.. తన భార్యను లోబర్చుకున్న ప్రమోద్.. ఆమెను వదలడానికి ఇష్టపడటం లేదని సంతోష్ చెప్పుకొచ్చాడు. ఇక తన భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు కూడా సంతోష్ ఇష్టపడలేదు. మరోసారి తన భార్య తనను చూడటానికి వస్తే  ఆమెకు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తానని అన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: