ఇటీవలే కాబోయే భర్తపై యువతి కత్తితో దాడి చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో సంతోషంగా మారిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఈ ఘటన తర్వాత  పెళ్లి చేసుకోవాలనే ఆలోచన వచ్చిన యువకులు కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురైన పరిస్థితులు తెచ్చింది.  సర్ప్రైజ్ ఇస్తానంటూ కాబోయే భర్తను కళ్ళు మూసుకొమని చెప్పిన మహిళ చివరికి దారుణంగా గొంతు కోసింది. ఈ క్రమంలోనే ఇక కాబోయే భర్త చేతిలో గాయపడిన వ్యక్తి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు.



 అయితే ఇటీవల ఇదే విషయంపై పోలీసుల ముందు అసలు విషయాన్ని ఒప్పుకుంది గాయపరిచిన పుష్ప. అసలు పెళ్లి వద్దని చాలాసార్లు తల్లిదండ్రులకు చెప్పానని అయినా వినలేదని  పోలీసుల ముందు చెప్పుకొచ్చింది. అయితే తల్లిదండ్రులు బలవంతంగా రామానాయుడుతో వివాహానికి సిద్ధపడ్డారని ఇష్టం లేని పెళ్లి చేసుకోలేక  ఆమె డిప్రెషన్లోకి వెళ్లి నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే బాధితుడు పై ఘోరానికి పాల్పడినట్లు ఒప్పుకుంది పుష్ప. చాలా కాలంగా భక్తి మైకంలో ఉన్న పుష్ప తనకు పెళ్లి వద్దని దేవుని భక్తురాలిగా ఉండిపోతా అంటూ తల్లిదండ్రులకు చెప్పినట్లు పోలీసులు విచారణలో తెలిసింది.


 ఇప్పటికి రెండు పెళ్ళిళ్ళు రద్దు కాగా ఇక మూడవ సారి ఎలాగోలా ఒప్పించారు తల్లిదండ్రులు. కాబోయే భర్తను బయటకు తీసుకువెళ్ళి చంపాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. కత్తి కనిపించకుండా వెంట తీసుకువెళ్ళిన పుష్ప ఇక గుడి దగ్గర రామానాయుడు కళ్ళకు చున్నీ కట్టి  ఇక కత్తితో గొంతుకోసింది. కానీ టైం బాగుండడంతో చివరికి ప్రాణాలతో బయటపడ్డాడు రామానాయుడు. అయితే ఆ తర్వాత వెంటనే అప్రమత్తమైన రామానాయుడు కళ్ళకు కట్టుకున్న చున్నీని గొంతుకు కట్టుకుని ఇక పుష్పను బైక్ ఎక్కించుకుని ఆస్పత్రికి వెళ్లాడు. మార్గమధ్యంలో పరిస్థితి విషమించడంతో అక్కడే సొమ్మసిల్లి పడిపోయాడు. ఓ యువకుడు పరిస్థితి చూసి ఆస్పత్రికి తరలించి   సహాయం చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది..

మరింత సమాచారం తెలుసుకోండి: