కానీ ఇటీవలి కాలంలో మాత్రం కొంతమంది ఏకంగా బాధ్యతగల పదవిలో కొనసాగుతూ కూడా మద్యం మత్తులో రచ్చ చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయ్. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. ఆమె ఏకంగా డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ గా ఒక బాధ్యతాయుతమైన పదవిలో కొనసాగు తోంది. అయితే ఇక ఎంతో హుందాగా మెలుగుతూ ప్రజలందరికీ ఆదర్శంగా నిలవాల్సిన ఆమె ఇటీవల ఏకంగా తప్ప తాగి రచ్చ చేసింది. ఏకంగా పోలీసు అధికారులు ఎంతలా సముదాయించేందుకు ప్రయత్నించిన కూడా వినకుండా నానా హంగామా సృష్టించింది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది.
యూపీలో మహిళా డిప్యూటీ లేబర్ కమిషనర్ గా పని చేస్తూ ఉంది రచన కేసర్వాణి ఇటీవలే మద్యం మత్తులో కారు డ్రైవింగ్ చేసింది. ఈ క్రమంలోనే కారు డ్రైవ్ చేస్తూ ఏకంగా డివైడర్ను ఢీకొట్టింది. అయితే అక్కడే ఉన్న పోలీసులు ఆమెను కారు నుంచి బయటకు తీశారు. దీంతో ఏకంగా పోలీసుల తోనే వాగ్వివాదానికి దిగింది. మీరు కేవలం పోలీసులు నేను జిల్లా స్థాయి అధికారి నన్ను ఆపొద్దు అంటూ పోలీసులపై దౌర్జన్యం చేసింది. పోలీసులు ఎంత సముదాయించేందుకు ప్రయత్నించినా వినకుండా రచ్చ చేసింది. దీంతో ఇక ఆమె భర్త కు ఫోన్ చేసి రప్పించాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ వీడియో కాస్త ప్రస్తుతం వైరల్ గా మారగా ఆమె పై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.