భార్య భర్తల మధ్య గొడవలు రావడం సహజం..అయితే వాటికి మొగ్గలొనె తుంచి వేయాలి..లేకుంటే అవి మాత్రం పెద్దగా అవుతాయి. చివరికి కాపురాలు నాశనం అయ్యేలా చేస్తాయి.కొంతమంది ఒకరి మీద మరొకరు కోపం పెంచుకోవడం వల్ల దారునాలకు పాల్పడుతున్నారు.ప్రాణాలను తియ్యడం లేదా తీసుకోవడం చేస్తారు. దాని వల్ల కుటుంబాలు నాశనం అవుతున్నాయి.ఇప్పుడు చాలా ఘటనలు ఇలానె వెలుగు చూస్తున్నాయి.. తాజాగా మరో ఘటన వెలుగు లోకి వచ్చింది. భార్య మీద కోపంతో ఎవరూ చేయని దారునానికి పాల్పడ్డాడు.


ఒకరంటే ఒకరికి తీరని ధ్వేషం ఏర్పడితే విడాకులు తీసుకుని ఎవరిదారి వారు చూసుకుంటారు. కానీ ఒక భర్త చేసిన పని అందరినీ షాక్‌కు గురిచేసింది. శత్రువును ఇరికించడం కోసం తన భార్యపై అత్యాచారం చేయించాడు.వివరాల్లొకి వెళితే.. ఈ దారుణ ఘటన ఉత్తర ప్రదేశ్ లో వెలుగు చూసింది.బదౌన్‌లో నివాసం ఉంటున్న ఒక వ్యక్తికి ఇటీవల వివాహం జరిగింది. ఆ వ్యక్తికి అదే ఏరియాలో ఉండే కొందరితో గొడవలు ఉన్నాయి. ఎప్పటినుంచో వారిపై పగ తీర్చుకోవాలని ఎదురుచూస్తున్నాడు. కానీ అందుకు తగిన సమయం దొరకలేదు. అయితే తానే చాన్స్ తీసుకొని వారిపై పగ తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. అంతే అందుకోసం పక్కా ప్లాన్ వేసుకున్నాడు. తన భార్యపై అత్యాచారం చేయించి శత్రువును ఇరికించాలని భారీగా స్కెచ్ వేశాడు.


అనుకున్న విధంగా భార్యను నిన్న బైక్ పైకి ఎక్కించుకొని నిర్మానుష్య మైన అటవీ ప్రాంతానికి తీసుకెల్లాడు.తన స్నేహితుడుకి ఫోన్ చేసి పిలిపించి అతడితో కలిసి భార్యపై రెండుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత పోలీసులకు ఫోన్ చేసి తన భార్యపై ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారని ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో పోలీసులు విచారణ చేశారు. తన భర్త ఇద్దరు ఫ్రెండ్స్ ను తీసుకొచ్చి అత్యాచారం చెయించాడని వాపొయింది.విషయం పై విచారణ జరిపిన పోలీసులు ఆమె భర్థను అత్యాచారానికి పాల్పడిన ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.పూర్తీ వివరాలు తెలియాల్సి ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: