ఇటీవలి కాలంలో జనాలు ఆలోచిస్తున్నా తీరు చూస్తుంటే సమాజం తీరు ఇంతలా మారిపోయిందా అని ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే వచ్చిన సమస్యలను ఎలా ఎదుర్కోవాలో ఎలా పరిష్కరించుకోవాలో అని ఆలోచించడం మానేసి సమస్యలనుంచి దూరంగా ఎలా పారిపోవాలి అని ఆలోచిస్తున్న వారు ఎక్కువైపోయారు నేటి రోజుల్లో. ఈ క్రమంలోనే కొన్ని కొన్ని సార్లు మనుషుల ఆలోచన తీరు చూస్తే అందరూ అవాక్కయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది అని చెప్పాలి.


 ఇక్కడ యువతీయువకులకు పెళ్లి జరిగింది. కానీ అయితే పెళ్లి అయిన నాటి నుంచి భర్త భార్యను పుట్టింటికి పంపించడం మానేసాడు. దీంతో ఎన్ని సార్లు భర్త దగ్గర పుట్టింటికి వెళ్తాను అంటూ చెప్పిన ఉపయోగం లేకుండా పోయింది. దీంతో భర్త తీరుతో విసిగి పోయిన సదరు వివాహిత షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఏకంగా ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి బయటకు వెళ్లి పోయింది. దీంతో ఇక ఇరు కుటుంబ సభ్యులు కూడా ఒక్కసారిగా షాక్ లో మునిగిపోయారు. ఇక ఆలస్యంగా వెలుగులోకి ఈ ఘటనకు సంబంధించి అటు బాచుపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కావడం గమనార్హం.


 హైదరాబాద్లోని నిజాం పేట కు చెందిన మౌనిక కు గత ఏడాది కొండాపూర్ కు చెందిన ధనుంజయ్ తో వివాహం జరిగింది. అప్పటి నుంచి ఆమెను భర్త పుట్టింటికి పంపించకుండా తనతోపాటే ఉంచుకున్నాడు.  ఈ క్రమంలోనే మౌనిక ఇటీవలే  బాబాయ్ గోపాల్ ఇంట్లో జరిగిన ఒక శుభకార్యానికి భర్త చెప్పకుండానే రహస్యంగా వెళ్ళింది. అయితే ఇటీవలే తన అత్తారింటికి వెళుతున్నాను అంటూ చెప్పిన మౌనిక ఇంటి నుంచి బయలుదేరింది. కానీ  అత్తారింటికి మాత్రం వెళ్లలేదు.  అయితే రాత్రి అయినా కూడా మౌనిక అత్తారింటికి చేరుకోక పోవడంతో కంగారుపడ్డారు కుటుంబ సభ్యులు. దీంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: