సాధారణం గా పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితం లో ఒక మధురమైన జ్ఞాపకం. ఈ పెళ్లిని మరింత ప్రత్యేకంగా మార్చుకునేందుకు ఎంతోమంది ఇష్టపడుతూ ఉంటారు. అందరిలా కాకుండా కాస్త కొత్తగా ట్రై చేసి ఇక పెళ్లిలో ఎంజాయ్ చేయాలి అని అనుకుంటూ ఉంటారు. ఇక ఇటీవలి కాలంలో పెళ్లిళ్లు ఎంత అంగరంగ వైభవంగా జరుగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వధూవరులు ఇద్దరూ కూడా డాన్సులు చేస్తూ పెళ్లి మండపం లోకి ఎంట్రీ ఇస్తున్నారు. మరికొంతమంది పెళ్లిళ్లు ఎలా జరిగిన ఊరేగింపు మాత్రం కన్నుల పండుగగా జరగాలని భావిస్తున్నారు.


 ఇక ఇలా పెళ్ళి ఊరేగింపు లకే కాస్త ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఇటీవలే రాజస్థాన్ లో మాత్రం ఒక వింత ఘటన చోటుచేసుకుంది. పెళ్లి చేసుకుంటున్నాను అన్న సంతోషంలో వరుడు అర్ధరాత్రి వరకు ఊరేగింపుగా డాన్స్ చేస్తూ పెళ్లి మండపానికి వెళ్ళాడు.  పెళ్లి మండపానికి వెళ్లిన తర్వాత వరుడికి ఊహించని షాక్ తగిలింది. వరుడు తీరుతో చిర్రెత్తు కొచ్చినా పెళ్లికూతురు వేరొకరిని పెళ్లి చేసుకుంది.


 ఈ ఘటన రాజస్థాన్లోని చురు లో వెలుగు లోకి వచ్చింది. పెళ్లి కూతురు చేసిన పనికి ప్రతి ఒక్కరూ అవాక్ అయ్యారనే చెప్పాలి. పెళ్లి వేడుక కోసం సిద్ధమైన వరుడు తన ఇంటి నుంచి ఊరేగింపుగా బయలు దేరాడు. స్నేహితులతో కలిసి ఎంతో సంతోషం గా డాన్సులు చేస్తూ పెళ్లి వేదిక వద్దకు చేరుకున్నాడు. ఇలా చేరుకునే సరికి తెల్లవారుజాము రెండు గంటలు అయింది. అయితే వరుడి కోసం ఎంతో సేపటి వరకు ఎదురు చూసిన వధువు అతడు రాకపోవడంతో చిర్రెత్తుకొచ్చి వేరొకరిని పెళ్లి చేసుకుంది   ఎంతో సంతోషంగా డాన్సులు వేసుకుంటూ వచ్చిన వరుడు వధువు చేసిన పనికి షాక్ అయి మళ్లీ నిరాశతో వెనుదిరిగాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: