శుభకార్యానికి హైదరాబాద్ వెళ్తున్న సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కుటుంబం లో తీవ్ర విషాదం నెలకొంది. అప్పటివరకూ చిరునవ్వుతో కనిపించిన చిన్నారి చివరికి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. కన్నవారి కళ్లెదుటే కంటికి రెప్పలా కాచుకునే కూతురు విగతా జీవిగా మారడంతో ఒక్కసారిగా కన్నపేగు విలవిలలాడి పోయింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా కొవ్వూరు పురపాలక కేంద్రం బైపాస్ వద్ద చోటు చేసుకుంది. కేశంపేట మండలం పాటిగడ్డ కు చెందిన ప్రశాంత్ రెడ్డి సాఫ్ట్ వేర్ ఉద్యోగి. అతని భార్య దివ్య రెడ్డి ఎయిడెడ్ పాఠశాలలో ఉపాధ్యాయులు.
వీరికి ఆరేళ్ల కుమారుడు విహాన్ రెడ్డి నాలుగేళ్ల కూతురు ఇవికా ఉన్నారు. ఇటీవలే వేసవి సెలవులు రావడంతో సొంత ఊరికి వచ్చారూ. కాగా నగరంలో శుభకార్యం ఉండడంతో భార్య దివ్య రెడ్డి కుమార్తె ఇవిక తో కలిసి బైక్పై బయలుదేరింది. ఇక ప్రశాంత్ రెడ్డి తల్లి కొడుకు తో కలిసి బస్సులో బయలుదేరారూ. కొత్తూరు దుర్గా బైపాస్ మలుపు తిప్పుకుని వెళ్తుండగా షాద్నగర్ నుంచి వేగంగా వచ్చిన ఇటుకల లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దివ్య రెడ్డి తప్పించుకోగా చిన్నారి ఇవిక లారీ టైర్ల కింద పడి నుజ్జునుజ్జయ్యింది. దీంతో తల్లిదండ్రులు శోకసముద్రంలో మునిగిపోయారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.