అయితే ఇలా డ్యూటీ కి వెళ్తున్నాను అంటూ చెప్పి వెళ్లిన కాసేపటికి ఊహించని ఘటన చోటుచేసుకుంది. పుట్టినరోజు నాడే ఆమెను మృత్యువు కబళించింది. ఎంఎంటీఎస్ రైలు వేగం ధాటికి ఎగిరి పడిన మహిళలు చివరికి ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాదకర ఘటన హైదరాబాద్ నగరంలోని ఖైరతాబాద్ రైల్వే స్టేషన్ చోటు చేసుకుంది. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్ర సోలాపూర్ కు చెందిన లావణ్య తండ్రి సోదరులు ఇద్దరు కూతుళ్లతో కలిసి కొన్నాళ్ల క్రితం హైదరాబాదు నగరానికి వచ్చారు.
ప్రస్తుతం తుమ్మ బస్తీలో నివాసముంటున్నారు వీరు. కాగా లావణ్య ఖైరతాబాద్లో టెలీకాలర్ గా పనిచేస్తుంది. ఈ క్రమంలోనే రోజు లాగానే బుధవారం సమయంలో తుమ్మల బస్తి నుంచి ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు దాటి ఖైరతాబాద్ వచ్చే క్రమంలో హైదరాబాద్ నుంచి లింగంపల్లి వెళ్లే ఎంఎంటీఎస్ రైలు స్పీడుడుకు ఒక్కసారిగా ఎగిరి పడింది లావణ్య. ఈ క్రమంలోనే తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఇలా పుట్టిన రోజు నాడే లావణ్య మృతి చెందడంతో కుటుంబ సభ్యులు అందరూ కూడా శోకసంద్రంలో మునిగిపోయారు అని చెప్పాలి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులుదర్యాప్తు చేస్తున్నారు..