వివరాల్లొకి వెళితే.. తమిళనాడులోని కాంచీపురంకు చెందిన గోవింద రాజ్ అనే వ్యక్తికి దీన , నందిని, దీప అనే ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. గోవీంద రాజ్ పారిశుధ్య కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అయితే మద్యానికి బానిస అయిన గోవింద తరచుగా విధులకు గైర్హాజరయ్యేవాడు. స్నేహితులతో కలిసి మద్యం సేవించి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో గొడవ పడేవాడు. శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో మద్యం సేవించడం ప్రారంభించాడు. ఆ సమయంలో నందిని, దీప స్కూలు నుంచి తిరిగి వచ్చారు. ఇంట్లోనే మద్యం సేవిస్తున్న తండ్రిని నిలదీశారు.
కూతుళ్లు నిలదీయడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన గోవింద వారిని ఓ చెక్కతో బలంగా కొట్టాడు. ఇద్దరి తలలపై తీవ్ర గాయాలు కావడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. రెండు గంటల తర్వాత దీన బయటి నుంచి వచ్చే సరికి ఇంటి తలుపులు లోపలి నుంచి వేసి ఉన్నాయి. ఆమె ఎంత కొట్టినా తలుపులు తీయలేదు. దీంతో ఆమె చుట్టుపక్కల వారికి విషయం చెప్పింది. వారు బలవంతంగా తలుపులు తెరవగా లోపల నట్టింట్లో ఇద్దరు కూతుళ్ల మృతదేహాల పక్కన గోవింద కూర్చుని ఉన్నాడు. బయటి వారిని చూసి పారిపోయేందుకు ప్రయత్నించాడు..వారు అంతా చుట్టూ చేరి అతన్ని పట్టుకున్నారు. ఈ ఘటన పై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని అతన్ని అదుపులోకి తీసుకున్నారు..