అంగరంగ వైభవంగా పెళ్లి వేదిక ముస్తాబయింది. బంధు మిత్రులందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కూడా వచ్చారు. వేదమంత్రాల సాక్షిగా మరో రెండు నిమిషాల్లో వరుడు అమ్మాయి కి తాళి కట్టాల్సి ఉంది. ఇంతలో పెళ్లికూతురు కళ్లు తిరిగి పడిపోయింది. అందరూ షాక్ అయ్యారు. వెంటనే కొన్ని నీళ్ళు చల్లి ఆ పెళ్లి కూతురుని కూర్చోబెట్టారు. ఆ తర్వాత వరుడు తాళికట్టేందుకు సిద్ధమయ్యాడు. కానీ వధువు మాత్రం వీలు లేదు.. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని మొండికేసింది. మైసూరు నగరంలోని విద్యా భారతి కల్యాణ మండపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
హెచ్డీ కోటే కు చెందిన యువకుడితో మైసూరుకు చెందిన శించిన అనే యువతికీ పెళ్ళి నిశ్చయించారు పెద్దలు. కాగా సరిగ్గా తాళికట్టే సమయానికి వధువు అడ్డం తిరిగింది తనకు పెళ్లి ఇష్టం లేదు అంటూ చెప్పింది. మా ఇంటి పక్కనే ఉండే యువకుడిని ప్రేమించానని అతనితో మూడుముళ్ళు వేసుకుంటానని చెప్పడంతో అందరూ షాక్ లో మునిగిపోయారు. ఈ విషయం ఏదో ముందే చెప్పొచ్చుగా ఇక్కడి వరకు వచ్చిన తర్వాత వద్దంటే ఎలా పెళ్లి కోసం ఎన్ని ఖర్చు పెట్టామో తెలుసా అంటూ తల్లిదండ్రులు ఆమె తీరును తప్పు పట్టారు పోలీసులు కూడా. వధువుకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఆమె అస్సలు వినిపించుకోలేదు. వధూవరులిద్దరిని ని కూడా పోలీస్ స్టేషన్కు తరలించారు.