ఇటీవలి కాలంలో మనుషులు సొంత వాళ్ల విషయంలోనే నీచాతి నీచంగా ఆలోచిస్తూన్న ఉండటం చూస్తూ ఉంటే సభ్య సమాజం తలదించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. కన్న తల్లి కడుపున పుట్టిన పిల్లల పాలిట శాపంగా మారి పోతూ ఉంటే అందరూ ముక్కున వేలేసుకుని దుస్థితి వస్తుంది  సాధారణంగా సొంత బిడ్డలకు ఏదైనా చిన్న కష్టం వస్తేనే తల్లడిల్లిపోతుంది తల్లి. అందుకే ఈ ప్రపంచంలో తల్లి ప్రేమ ఎంతో గొప్పది అని చెబుతూ ఉంటారు.


 ఇక్కడ ఒక తల్లి మాత్రం ఇంకా లోకాన్ని కూడా సరిగ్గా చూడని చిన్నారి కొడుకును ఏకంగా పడక సుఖం కోసం దూరం చేసుకోవాలని ప్లాన్ వేసింది. ఇక భర్తను కాదని చివరికి కొడుకును కూడా వదిలించుకుని ప్రియుడితో రాసలీలల్లో మునిగి తేలాలని నిర్ణయించుకుంది   కానీ సదరు మహిళ వేసిన ప్లాన్ అని కాస్త బెడిసి కొట్టడంతో చివరికి కటకటాలపాలయ్యింది. బెంగుళూరు లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. రాయచూర్ బస్టాండ్ లో యువకుడి చేతికి ఓ మహిళ చిన్నారి కొడుకుని ఇచ్చి ఇప్పుడే వస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది.


 చివరికి ఆ మహిళ ఎంతకీ రాకపోవడంతో సదరు యువకుడు పోలీసులకు ఆ బాలుడిని ఇచ్చి జరిగిన విషయం చెప్పాడు. ఈ క్రమంలోనే కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.  ఇదంతా సినిమా రేంజ్ లో ప్లాన్ చేశారు అని అర్థమైంది. మైసూరు జిల్లా హెచ్డి కోటకు చెందిన రఘుకు వివాహిత పరిచయమైంది. పరిచయం అక్రమ సంబంధం అయ్యింది. ఆమెకు చిన్నారి కొడుకు భర్త ఉన్నారు. భర్తకు భార్య వివాహేతర సంబంధం గురించి తెలిసి దూరంగా ఉంటున్నాడు. బిడ్డను కూడా వదిలించుకోవాలని ప్లాన్ వేశారు. కానీ చివరికి ప్లాన్ బెడిసికొట్టింది. పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు చేయడంతో నిజం ఒప్పుకున్నారూ నిందితులు.

మరింత సమాచారం తెలుసుకోండి: