అమ్మాయిలకు మాతృత్వం ఒక వరం.. ఆ అనుభూతి కోసం చాలా మంది పరితపించి పోతున్నారు.. కొందమంది శారీరక సుఖం కోసం ఆ అమ్మతనాన్ని వదిలేస్తున్నారు..అయితే ఈ మధ్య అబార్షన్ చేయించుకునెవారికి ప్రభుత్వం షాక్ ను ఇస్తుంది..సరైన కారణం చెప్పి చెయించుకొవాలని హెచ్చరిస్తున్నారు.ఈ మేరకు ఓ మహిళ న్యాయమూర్థికి చెప్పిన కారణం విని అందరు షాక్ అయ్యారు.అబార్షన్ కోసం ఆమె ఏం చేసింది అన్న విషయం జనాలను ఆలోచనలో పడేసింది.ఇప్పుడు అది సంచలనంగా మారింది.
 

వివరాల్లొకి వెళితే..ఉత్తరప్రదేశ్‌లో ఓ మహిళ మాత్రం అబార్షన్ కోసం తనకు అనుమతి ఇవ్వాలని కోర్టును ఆశ్రయించింది. ఆమె చెప్పిన నిజాలు విని న్యాయమూర్తి సైతం నివ్వెరపోయారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే.. బాధితురాలి కథనం మేరకు.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం జలౌన్‌ పరిధికి చెందిన యువతికి మలన్‌పూర్‌ పరిధికి చెందిన యువకుడితో 2021 జూన్‌లో వివాహమైంది. ఈ దంపతులు తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉంటున్నారు. వీరి సంసారంలో మొన్నటి వరకు ఎలాంటి సమస్యలూ లేవు. అయితే ఇటీవల మహిళపై ఆమె మామ కన్నేశాడు. ఈ క్రమంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓ రోజు కోడలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కొన్ని నెలల తర్వాత ఆమె గర్భం దాల్చింది..



అయితే తన పై తన మామ చేసిన బలవంతం గురించి అందరికి తెలియజెసింది.భర్త, కుటుంబ సభ్యులకు తెలియజేసింది.తర్వాత తనకు అబార్షన్‌కు అనుమతి ఇవ్వాలని బాధితురాలు కోర్టును ఆశ్రయించింది. కోర్టులో ఆమె చెప్పింది విని అంతా షాక్ అయ్యారు. అయితే బాధితురాలు గర్భం దాల్చడానికి ఆమె మామ కారణం కాదని తెలిస్తే.. ఫిర్యాదుదారుపై చర్యలు తప్పవని కోర్టు హెచ్చరించింది. ఈ కేసు విచారణను ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసింది. ప్రస్తుతం ఈ గర్భం విషయం స్థానికంగా సంచలనంగా మారింది..ఈ ఘటన పై కోర్టు తీర్పు అందరినీ ఆలోచనలో పడవేసింది..తర్వాత ఎం జరిగింది అనేది తెలియాల్సి వుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: