మనుషులు ఎక్కువగా ఆలొచించడం వల్ల లేక మరే ఇతర కారణాల వల్లో తెలియదు కానీ, కొందరు మాత్రం పూజల పేరుతో మూధనమ్మకాలను ఎక్కువగా నమ్ముతున్నారు.ఒకవైపు ప్రముఖులు చెబుతున్నా కూడా మరోవైపు ఇలాంటి వాటిని నమ్మడం చేస్తున్నారు.చచ్చిన శవాలను కూడా వడకుండా ఏదొక విధంగా చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు.తాజాగా ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.తల్లి మృతదేహం తో ఏవో పూజలు చేస్తూ స్థానికులను భయ పెట్టింది.ఇంటి నుంచి దుర్వాసన రావడం తలుపులు బద్దలు కొట్టి లోనికి వెళ్ళి చూసి షాక్ అయ్యారు.


వివరాల్లోకి వెళితే.. ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లక్‌నవూ నగరంలొ ఇందిరా నగర్ ప్రాంతంలో నివసించే సనీతా దీక్షిత్ అనే మహిళ తన కూతురు అంకితతో కలిసి నివసిస్తోంది. సునీతా ఒక రిటైర్డ్ ఇంజినీర్. ఆమె హిందుస్తాన్ ఏరానాటికల్ లిమిటెడ్ సంస్థలో పనిచేసేది. సునీత కూతురు అంకిత కూడా ఒక ఉద్యోగం చేస్తోంది. సునీతా తరుచూ తన పక్కింటి మహిళతో రోజూ మాట్లాడుతూ ఉండేది. కానీ పది రోజులుగా ఆమె అసలు బయటికే రాలేదు. దీంతో పక్కింటి మహిళ సునీతకు అనారోగ్యం చేసిందేమోనని పలకరించేదుకు వెళ్లింది. ఇల్లు లోపలి నుంచి లాక్ చేసి ఉండడంతో ఆ పక్కింటి మహిళ తలుపులు కొట్టింది. ఇంతలో ఏదో దుర్వాసన వచ్చింది. అయినా ఆమె తలుపులు కొడుతూనే ఉంది...


ఇరుగు పొరుగు వారి సాయం కోరింది..వారంతా కలిసి ఇంటి తలుపులు పగలకొట్టి లోపలికి వెళ్లారు. అక్కడ వారంతా వెళ్లి చూడగా.. అంకిత తన గదిలో ఏవో పూజలు చేస్తోంది. ఆమె తల్లి సునీత మాత్రం ఎక్కడుంతో కనపడలేదు. కానీ ఒక గదిలో నుంచి చాలా ఘాటుగా దుర్వాసన వస్తోంది. ఆ గది లాక్ చేసి ఉంది. అంకితను వారంతా ఆ గది తాళాలు ఇవ్వమని అడిగారు. కానీ అమె ఇవ్వలేదు. దీంతో వారంతా ఆ గది తలుపులు పగలకొట్టారు..ఆమె లోపలకు వెళ్ళి చూడగానే ఒక్కసారే షాక్ అవుతున్నారు..ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘటన గురుంచి పూర్తీ వివరాలు తెలియాల్సి ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: