చిన్న గొడవలు జనాలను నేరస్థులుగా మారుస్తున్నాయి.మాట మాట పెరిగి చిన్నవి కాస్త పెద్దవిగా మారుథున్నాయి. అలాంటి ఘటనలు ఈ మధ్య ఎక్కువగా జరుగుతున్నాయి.. తాజాగా మరో ఘటన వెలుగు లోకి వచ్చింది. ఓ వ్యక్తికి వెయ్యి రూపాయలు ఇచ్చాడు. దానిని మళ్ళీ తిరిగి ఇవ్వమని కోరాడు..అయితే దానికి తిరిగి ఇవ్వమని కొరగ, అది మాట మాట పెరిగి ప్రాణం తీసింది. నూజివీడులో వెలుగు చూసింది. అసలు విషయాన్నికొస్తే..


తనకు ఇవ్వాల్సిన వెయ్యి రూపాయల ను ఇవ్వమన్నందుకు వ్యక్తిని హత్య చేసిన ఘటన ఏలూరు జిల్లా నూజివీడు మండలం వెంకటాద్రిపురం లో ఆదివారం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వెంకటాద్రిపురానికి చెందిన గొల్లపల్లి శ్రీనివాసరావు మండలంలోని రావిచర్లలో ఉన్న సిమెంట్‌ ఇటుక రాళ్ల కంపెనీ లో ట్రాక్టర్‌ డ్రైవర్‌ గా పనిచేస్తున్నాడు. ఇంటి వద్ద అవసరమై 200 సిమెంట్‌ రాళ్లను గతంలో తెచ్చుకొని ఉంచాడు. వాటిలో 50 రాళ్లను అదే గ్రామాని కి చెందిన కూచిపూడి రంగా అనే వ్యక్తి రెండు నెలల క్రితం తీసుకెళ్లాడు. వాటికి సంబంధించి వెయ్యి రూపాయలు ఇవ్వాలని, లేదంటే సిమెంట్‌ రాళ్లనైనా తిరిగి ఇచ్చేయమని శ్రీనివాసరావు అతనిపై ఒత్తిడి చేస్తున్నాడు.


ఇదే విషయమై ఇద్దరూ పలుమార్లు గొడవ పడ్డారు. ఆదివారం సాయంత్రం కూడా ఇదే విషయమై వారి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది.. ఇకపోతే ఈ నేపథ్యం లో రంగా సమీపంలో ఉన్న కర్రతో శ్రీనివాసరావుపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన శ్రీనివాసరావును స్థానికులు హుటాహుటిన నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించ గా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్టు నిర్ధారించారు. మృతుడి కి భార్య, నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఊహించని ఈ ఘటన గ్రామంలో తీవ్ర సంచలనం కలిగించింది. ఈ ఘటన పై పూర్తీ వివరాలు తెలియాల్సి ఉన్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: