దాంపత్య జీవితం ఎంతో మధురమైనది అని చెబుతూ ఉంటారు పెద్దలు. అయితే భార్య భర్తలు కష్టసుఖాలు పంచుకుంటూ ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ ముందుకు సాగినప్పుడే ఆ దాంపత్య బంధం మరింత సంతోషంగా ఉంటుంది అని అంటూ ఉంటారు. ఇక భార్య భర్తల బంధం లో ఇలాంటివి లోపించాయి అంటే ఇక దాంపత్య బంధానికి మించిన నరకం మరొకటి ఉండదు అని అంటూ ఉంటారు. అందుకే భార్య భర్తలు అన్న తర్వాత ఎప్పుడూ ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. కానీ నేటి రోజుల్లో భార్య భర్తలు మాత్రం బద్ధ శత్రువులలాగానే మారిపోతున్నారు.


 ఈ క్రమంలోనే ఒకరి ప్రాణాలు పోవడానికి మరొకరు కారణమవుతున్నారు అని చెప్పాలి. దీంతో ఎంతో మంది ఇక పెద్దలు కుదిర్చిన వివాహం పై నమ్మకం లేకుండా ప్రేమ వివాహాలు చేసుకుంటున్నారు. అయితే అర్థం చేసుకునే గుణం ఉండాలి కానీ ఎలాంటి వివాహం అయితే ఏంటి అన్నట్లుగా ప్రేమ వివాహం లో కూడా మనస్పర్ధలు వచ్చి విడిపోతున్న వారు చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఐదేళ్ళపాటు ప్రేమించుకున్నారు ఆ తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఎంతో సంతోషంగా కాపురం చేశారు. ఇక ఆరేళ్లు కాపురం చేసిన తర్వాత అప్పుడు భర్తకు భార్య అందం గుర్తుకు వచ్చింది.


 దీంతో నువ్వు అందంగా లేవు అంటూ భార్యను తరచూ వేధించడం మొదలుపెట్టాడు. చివరికి భార్య ఉసురు తీశాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని ఉమ్మడి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం లో వెలుగు లోకి వచ్చింది. బ్రహ్మయ్య గుడి కి చెందిన కుల్లాయప్ప స్థానికంగా కూలిపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆరేళ్ల క్రితం అదే ప్రాంతానికి చెందిన అపర్ణ ను.. అంతకుముందే  ఐదేళ్లపాటు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం వీరికి ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. మద్యానికి బానిసైన కుల్లాయప్ప రోజు తాగొచ్చి భార్యను కొడుతూ ఉండేవాడు. నువ్వు అందంగా లేవంటూ వేధిస్తూ ఉండేవాడు. ఇటీవల మరోసారి గొడవ పడటంతో కోపంతో భార్యను కత్తితో పొడిచాడు. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. అపర్ణ తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: