మనుషులు రాను రాను అడవి మృగాలుగా మారుతున్నారని చెప్పడం లో ఎటువంటి సందేహం లేదు..డబ్బు పిచ్చి తో కొందరు, అధికార మదం తో మరి కొందరు పేదల రక్తాన్ని లాగుతున్నారు.ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఘటనలు ఉదాహరణగా చెప్పవచ్చు. ఈ మధ్య జరుగుతున్న ఘటనలు భయ భ్రాంతులకు గురి చేస్తున్నాయి. తాజాగా మరో ఘటన వెలుగు లోకి వచ్చింది.పురిటి నొప్పుల తో ఆసుపత్రికి వచ్చిన గర్బినీ పై నిర్లక్ష్యంగా వ్యవహరించారు.దాంతో కడుపు లోని బిడ్డ చనిపోయింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.


వివరాల్లొకి వెళితే..హైదరాబాద్ పాతబస్తీ చాదర్ ఘాట్‌లో దారుణం జరిగింది. ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో డెలివరీ కోసం వచ్చిన మహిళకు హాస్పిటల్ సిబ్బంది తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు.పురిటి నొప్పులతో బాధపడుతున్న పేషెంట్‌ను పట్టించుకోకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. హాస్పిటల్‌ని ఫైవ్ స్టార్ ఫంక్షనల్ హాల్‌గా మార్చేసి డీజే పెట్టి బాణాసంచా కాలుస్తూ.. హాస్పిటల్ సిబ్బంది నానా హంగామా చేశారు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో శిశువు మరణించింది. లోబీపీతో వచ్చిన గర్భిణీని అడ్మిట్ చేసుకొన్న సిబ్బంది.. బీపీ నార్మల్ చేశారు వైద్యులు. ఆ తర్వాత బాధితురాలిని ఆస్పత్రిలో పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశారు. పరిస్థితి విషమించడంతో పుట్టబోయే బిడ్డ కడుపులోనే చనిపోయింది. ఈ సమయంలో బాధితురాలు బెడ్‌పైనే నరకం అనుభవించింది..


ఆసుపత్రిని ఫంక్షన్ హాల్ గా మార్చి,హాస్పిటల్ సిబ్బంది గానా బజానాతో బాణాసంచాలు కాల్చి పెద్ద హంగామా సృష్టించారని, దీంతో మహిళ ఆరోగ్యం క్షీణించి కడుపులోని బిడ్డ చనిపోయిందని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. చివరకు అతికష్టం మీద మహిళ ప్రాణాలను కాపాడారని పేర్కొన్నారు. ఈ ఘటన అనంతరం ఆస్పత్రి తీరుపై బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో బంధువులు చాదర్ ఘాట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగప్రవేశం చేయడంతో సిబ్బంది మొత్తం హాస్పిటల్ వదిలేసి పారిపోయారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పొలిసులు విచారణ చేపట్టారు.


మరింత సమాచారం తెలుసుకోండి: