అయితే ఇలా అర్ధరాత్రి ఫోన్ చేసి పిల్లిని కాపాడండి అన్నప్పుడు ఎవరైనా సరే పోలీస్ కమిషనర్ చిరాకు పడతారేమో అని అనుకుంటారు. కానీ ఆయన మాత్రం ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించి పిల్లి ప్రాణాలు కాపాడటానికి అసిస్టెంట్ కమిషనర్ ను పురమాయించాడు. ఇక ఆ తర్వాత అగ్నిమాపక సిబ్బంది పోలీసులు కలిసి బావిలో పడిన పిల్లలు కాపాడారు. ఈ ఘటన కరీంనగర్లో వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. స్థానిక విద్యానగర్లోని కేడీసీసీ బ్యాంకు వద్ద నివాసముంటున్న మనోహర్ ఇంటి వెనకాల ఎవరు వినియోగించని బావి ఉంది. అయితే ఇంటి పరిసరాల్లో సంచరించే రెండు పిల్లులు పోట్లాడుకుని చివరికి ఒక పిల్ల బావిలో పడిపోయింది.
ఈ విషయాన్ని గమనించిన మనోహర్ వెంటనే జంతు సంరక్షణ సిబ్బందిని ఆశ్రయించగా వారి సూచన తో మనోహరాబాద్ కరీంనగర్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణకు అగ్నిమాపక సిబ్బంది కి ఫోన్ చేశారు. అయితే ఇక పోలీస్ కమిషనర్ సమస్యను పరిష్కరించేందుకు అసిస్టెంట్ కమిషనర్ ను పురమాయించాడు. ఈ క్రమంలోనే అర్ధరాత్రి 12:30 గంటల సమయంలో ఇక అక్కడికి చేరుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది ఒక జాలి గంపను బావిలోకి వదిలి పిల్లి ప్రాణాలను రక్షించారు. ఇక ఈ ఘటన ద్వారా ఎవరికి ఏ కష్టంవచ్చిన మేమున్నాము అని ధైర్యం ఇస్తామని పోలీసులు చెప్పకనే చెప్పారు అని నేటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.