ఇటీవలి కాలంలో ప్రేమించడమే పాపం గా మారి పోతుంది. ఎందుకంటే ప్రేమించిన కారణానికి ఎంతో మంది యువతులు మోస పోతూ చివరికి మనస్థాపం  తో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇక మరికొన్ని సంఘటనల్లో ఏకంగా చిన్నచిన్న గొడవలకు ఉన్మాదిగా మారి పోతున్న ప్రియుడు దారుణం  గా ప్రియురాలిని హత్య చేసిన ఘటనలు కూడా వెలుగు లోకి వస్తున్నాయి. ఇలా నేటి రోజుల్లో ప్రేమ అనేది ఎంతో మంది యువతులు పాలిట శాపంగా మారి పోతుంది అని చెప్పాలి.


 ఇటీవలే చత్తీస్ ఘడ్ లో కూడా ఇలాంటి దారుణ ఘటన వెలుగు చూసింది. ప్రియురాలు తనని దూరం పెడుతుంది అంటూ ఎవరూ లేని సమయం లో ఇంటికి వెళ్ళాడు యువకుడు. ఈ క్రమం లోనే ప్రియురాలి తో గొడవ పడ్డాడు.తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె మణికట్టు ను కట్ చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటన స్థానికం గా సంచలనం గా మారి పోయింది అని చెప్పాలి. ఒకే గ్రామానికి చెందిన యువతీ యువకులు కొన్నాళ్లు గా చనువుగా ఉంటూ వస్తున్నారు. ఇటీవల యువతకి వేరే గ్రామం లో ఉద్యోగం రావడం తో యువతి అక్కడే ఉంటుంది.


 ఈ క్రమం  లోనే ప్రియుడిని కొద్ది రోజుల నుంచి దూరం పెడుతూ వస్తుంది యువతి. అయితే ప్రియురాలు దూరం పెట్టడాన్ని అతడు మాత్రం అస్సలు తట్టుకోలేక పోయాడు. దీంతో ఇటీవల ఇంట్లో ఎవరూ లేని సమయం లో ప్రియురాలిని కలిసేందుకు వెళ్ళాడు. అయితే ప్రియురాలు ఇక అతనితో పాటు ప్రేమను కొనసాగించడానికి తిరస్కరించింది. దీంతో ఆగ్రహం  తో ఊగిపోయిన యువకుడు తన వెంట తెచ్చుకున్న కత్తితో యువతి మణికట్టును కోశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే యువతి కేకలు వేయడంతో స్థానికులు వచ్చి ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: