మనుషులు ఆలోచనా తీరు ఎంత దారుణంగా మారిపోతుంది అంటే మొన్నటి వరకూ పరాయి వ్యక్తుల ప్రాణాలను పెద్దగా లెక్క చేసేవారు కాదు. కానీ మనం మన కుటుంబం బాగుందా లేదా అని చూసుకునేవారు.  కానీ ఇటీవల కాలంలో ఏకంగా సొంత కుటుంబ సభ్యులను దారుణంగా హతమార్చిన ఘటన లు  కూడా వెలుగులోకి వస్తున్నాయి.  చిన్న చిన్న కారణాలకే సొంత వారి ప్రాణాలు తీస్తూ చివరికి ఉన్మాదులు గా మారిపోతున్న మనుషులను చూస్తుంటే సభ్యసమాజం ఉలికిపడే  పరిస్థితి నెలకొంది అని చెప్పాలి. ముఖ్యంగా  భార్యాభర్తల మధ్య తలెత్తిన చిన్నపాటి గొడవలు, అక్రమ సంబంధాలు ఇలా ఎన్నో కారణాలతో అన్యోన్యంగా ఉండాల్సిన భార్య భర్తలు  బద్ద శత్రువులు గా మారిపోయి ఒకరి ప్రాణాలు తీసుకుంటున్నారు.


 నేటి రోజుల్లో ఇలాంటి ఘటనలు కోకొల్లలు అన్న విషయం తెలిసిందే. ఇటీవల అనంతపురం విద్యుత్ శాఖలో అసిస్టెంట్ లైన్మెన్ గా పనిచేస్తున్న అశోక్ హత్య కేసు సంచలనంగా మారిపోయింది. ఘటన  పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే హంతకులు  ఎవరు అనే విషయం బయటపడింది. కట్టుకున్న భార్య ప్రియుడితో కలిసి హతమార్చినట్లు పోలీసులు విచారణలో తేలింది. పెద్దవడుగూరులో అసిస్టెంట్ లైన్మెన్ గా పనిచేస్తున్న చట్నీ పల్లికి చెందిన అశోక్ ఈ ఏడాది 12వ తేదీన చట్నీపల్లి  రైల్వే బ్రిడ్జి వద్ద గుంటలో పడి పడి మృతి చెందాడు.


 ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం రిపోర్ట్  లో హత్య అని తేలడంతో విచారణ మరింత వేగవంతం చేశారు. భార్య కవిత చెప్పే సమాధానాలు అనుమానాస్పదంగా ఉండటంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ చేయడం మొదలుపెట్టారు. అయితే కవిత బసినేపల్లి నివాసి హరికృష్ణతో వివాహేతర సంబందం కొనసాగిస్తోంది. బంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని  ప్రియుడితో కలిసి పథకం వేసి చెట్నే పల్లి  సమీపంలోని రైల్వే బ్రిడ్జి వద్ద ఒంటరిగా అశోక్ మద్యం సేవిస్తున్నాడని తెలుసుకొని కవిత హరికృష్ణ అక్కడకు చేరుకొని ఫుల్లుగా మద్యం తాగించి ఇక అక్కడే హతమార్చారు. నీటి గుంటలో పడి మృతి చెందాడని  కవిత ఫిర్యాదు చేసి కొత్త రకమైన నాటకం ఆడినట్లు  విచారణలో తేలింది.

మరింత సమాచారం తెలుసుకోండి: