నేటి ఆధునిక సమాజంలో కూడా ఇంకా ఎంతోమంది కులం మతం అంటూ మాట్లాడుతూ దారుణాలకు  పాల్పడుతున్న  ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయ్. అయితే ఇద్దరు యువతీయువకుల మధ్య పుట్టే ప్రేమ కులం మతాన్ని అసలు చూడదు. కానీ తీరా ఆ ప్రేమను గెలిపించుకోవాలంటే మాత్రం అదే కులం మతం అడ్డు వస్తుంది. మతాలు వేరైనా కారణంగా ప్రేమ జంటల పెళ్లి చేసేందుకు పెద్దలు ఒప్పుకోవడం లేదు.  పెద్దలను ఎదిరించి ఎవరైనా ప్రేమ జంటలు పెళ్లి చేసుకున్నారు అంటే చాలు రక్తపాతం చేయడానికి కూడా సిద్ధమైపోతున్నారు పెద్దలు. దీంతో ఇటీవల కాలంలో రోజురోజుకు పరువు హత్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.



 ఏకంగా కనీసం జాలి దయ లేకుండా నిర్ధాక్షణ్యంగా ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడడం లేదు మనుషులు. ఈ రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు సభ్యసమాజాన్ని ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేస్తున్నాయి అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగుచూసింది. తన సోదరిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అని కోపంతో యువతి సోదరులు యువకుడిని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన రాయచూరు అఫ్జల్ పుర తాలూకా దేవల గానగాపుర లో వెలుగులోకి  వచ్చింది. అదే ప్రాంతంలో లాడ్జిలో విధులు నిర్వహిస్తున్నాడు 24 ఏళ్ళ చంద్రకాంత్. ఇక అదే ఊర్లో డిగ్రీ చదువుతున్న అమ్మాయి తో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది.


 ఆరు నెలలుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఇంట్లో చెప్తే తమ పెళ్లికి అంగీకరించరని చివరికి పెద్దలను ఎదిరించి రహస్యంగా ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. ఆ యువతి సోదరులు మాత్రం పగతో రగిలిపోయారు. వీరి ఆచూకీ కోసం గాలింపు చెప్పగా బెంగుళూరు లో ఉన్నారని తెలుసుకుని  అక్కడి నుండి మళ్లీ స్వగ్రామానికి తీసుకువచ్చారు. తమ సోదరి అంటే ఇష్టం లేదని చెప్పాలంటూ చంద్రకాంత పై శతవిధాల ఒత్తిడి తీసుకువచ్చారు యువతి సోదరులు. అతను ఒప్పుకోకపోవడంతో చివరికి ప్లాన్ ప్రకారం దారుణంగా హత్య చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: