గుంటూరు జిల్లా వేట పురం గ్రామానికి చెందిన శివ శంకర్ బాబు ప్రైవేట్ కంపెనీలో హెచ్ఆర్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. అయితే గత ఏడాదిగా అదే కంపెనీలో పనిచేస్తున్న యువతితో అతనికి పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారి పోయింది. యువతి తల్లిదండ్రులు అంగీకారంతో డిసెంబర్లో ఆమెను వివాహం చేసుకున్నాడు శివ శంకర్. పెళ్లి తర్వాత కొన్నాళ్లకే ఆమె బంగారం నగదు తీసుకుని వేధించడం మొదలుపెట్టాడు. ఇక ఆ తర్వాత అతని తీరుపై అనుమానం వచ్చినా యువతి కుటుంబ సభ్యులు ఆరా తీయగా షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది.
గతంలోనే పలువురు యువతులను మోసం చేసి పెళ్లి చేసుకున్నట్లు తేలింది. వెంటనే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు బాధితులు. అతన్ని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. విషయం తెలుసుకున్న మహిళా సంఘాల నేతలు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఆడ పిల్లల జీవితాలతో చెలగాటమాడుతున్న శివ శంకర్ బాబు ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసు విచారణలో భాగంగా ఇప్పటి వరకు 12 మంది యువతులను వివాహం చేసుకున్నట్లు తేలింది. ఇక ఈ నిత్య పెళ్ళికొడుకు వ్యవహారం కాస్త హాట్ టాపిక్ గా మారింది.