ఇటీవలి కాలంలో పెళ్లి అనేది ఎంతో మంది మహిళల పాలిట శాపంగా మారిపోతుంది . పెళ్లి తర్వాత భర్తతో ఎంతో సంతోషంగా ఉండొచ్చు అని కోటి ఆశలతో మెట్టినింట్లో అడుగుపెట్టిన ఎంతోమంది అమ్మాయిలకు కొన్ని రోజుల్లోనే చిత్రహింసలు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలోనే నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత ఎంతోమంది అమ్మాయిలు పెళ్లి చేసుకోవడానికి కూడా భయపడిపోతున్నారు అని చెప్పాలి. కాగా ఇక పెళ్లి చేసుకొని  వేధింపులతో దుర్భర జీవితాన్ని గడుపుతున్న ఎంతోమంది మహిళలు చివరికి తమ బాధను పుట్టింటి వారికి చెప్పుకోలేక తమలో తామే కుమిలిపోతున్నారు. చివరికి కఠిన నిర్ణయాలు తీసుకుంటూ బలవన్మరణాలకు కూడా పాల్పడుతున్నారు.


 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. కొన్నాళ్లపాటు సాఫీగా సంసారం చేసిన భర్త అందంగా లేవు అంటూ సూటిపోటి మాటలతో వేధించడం మొదలు పెట్టాడు. ఇక భర్త వేధింపులు రోజురోజుకి ఎక్కువవడంతో భరించలేకపోయిన సదరు మహిళ ఒంటిపై కిరోసిన్ పోసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాదకర ఘటన కర్ణాటకలోని డీజే హళ్లి లో వెలుగులోకి వచ్చింది. మూడేళ్ల క్రితం నిజాముద్దీన్ అనే వ్యక్తిని అనీషా రెండో వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే కొన్నాళ్లపాటు ఎంతో సాఫీగా సంసారం చేసాడు భర్త.


 ఆ తర్వాత మాత్రం నువ్వు అందంగా లేవు.. నిన్ను పెళ్లి చేసుకుని తప్పు చేశాను అంటూ సూటిపోటి మాటలతో భర్త శారీరకంగా మానసికంగా వేధించడం మొదలుపెట్టాడు. అయితే ఇటీవలే ఇదే విషయంపై భార్యభర్తలిద్దరు మధ్య గొడవ జరిగింది. ఇక భర్త వేధింపులతో తీవ్ర మనోవేదనకు గురైన అనిషా  ఇంట్లో ఎవరూ లేని సమయంలో కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఇక మృతురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: