మనిషి జీవితం గ్యారెంటీ లేనిది ఎందుకంటే ఎప్పుడూ మృత్యువు ఎటువైపు నుంచి ముంచుకు వస్తుంది అన్నది ఊహకందని విధంగానే ఉంటుంది . అంతా సంతోషంగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో క్షణ కాల వ్యవధిలో ఏదో ఒక రూపంలో ప్రమాదం ముంచుకొచ్చింది చివరికి మృత్యువు కబళించటం లాంటిది జరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఇలాంటి తరహా ఘటనలు ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపుతూ  ఉంటాయి. మరీ ముఖ్యంగా ఇటీవలి కాలంలో అభం శుభం తెలియని చిన్నారులు విషయంలో విధి పగ బట్టి నట్లు గా వ్యవహరిస్తూ ఇక మృత్యువు కబళిస్తున్న  ఎన్నో హృదయవిదారక ఘటనలు ఎంతోమంది మనసు తణుకు  పోయేలా చేస్తున్నాయ్ అని చెప్పాలి.


 అప్పటి వరకూ ఎంతో సంతోషంగా చిరునవ్వుతో కళ్లముందు ఆడుకున్న పిల్లలు కేవలం నిమిషాల వ్యవధిలోనే మృత్యుఒడిలోకి చేరడాన్ని కళ్లారా చూసిన తల్లిదండ్రులు ఇక అరణ్యరోదనగా గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నారు. ఇటీవల ఇలాంటి హృదయ విదారక ఘటనలు సోషల్ మీడియాలో ఎన్నో తెర మీదికి   వస్తున్నాయ్. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది అని చెప్పాలి. కూతురు అంటే ఆ తల్లిదండ్రులకు పంచప్రాణాలు. కూతురే లోకంగా వాళ్ళు జీవితాన్ని గడుపుతున్నారు. ఉన్నదాంట్లో  సర్దుకుపోతూ సంతోషంగా జీవితం నడుపుతున్న ఆ  కుటుంబాన్ని చూసి విధి వెక్కిరించింది.


 చివరికి యమపాశం అయ్యి అప్పటివరకు నవ్వుతూ ఆడుకున్న ఆ చిన్నారిని కానరాని లోకాలకు పంపించేసింది. ఈ విషాదకర ఘటన సర్జపుర పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. కామన హళ్లిలో బాలకృష్ణ తన భార్యతో నివాసముంటున్నాడు. వారికి ఏడాదిన్నర వయస్సున్న మనిషా అనే కూతురు కూడా ఉంది. అయితే ఇటీవలే బాలకృష్ణ తాను నడిపే వాహనాన్ని రివర్స్ చేస్తున్న సమయంలో మనీషా అకస్మాత్తుగా వాహనం వెనకాల కు వచ్చింది. దీంతో ఇది గమనించలేదు బాలకృష్ణ. ఈ క్రమంలోనే చిన్నారి వాహనం కింద ఇరుక్కొని తీవ్ర గాయాలపాలైంది. తల్లిదండ్రులు వెంటనే గమనించి ఆసుపత్రికి తరలించగా చివరికి చికిత్స పొందుతూ మరణించింది. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: