టీనేజ్ అబ్బాయిని కిడ్నాప్ చేసి తనతోపాటు తీసుకెళ్లిన నేరానికి ఆమెపై కేసు పెట్టి పోలీసులు జైలుకి పంపించారు. ఆ అబ్బాయికి కౌన్సెలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ ఘటన కృష్ణా జిల్లా గుడివాడలో జరిగింది. గుడివాడకు చెందిన ఓ బాలుడిని ఓ వివాహిత కిడ్నాప్ చేసినట్టు ఇటీవల కేసు నమోదైంది. అయితే బాలుడికి మాయమాటలు చెప్పి ఆమె తనతో తీసుకెళ్లినట్టు, హైదరాబాద్ లో ఓ రూమ్ లో వారిద్దరూ ఉంటున్నట్టు పోలీసులు గుర్తించారు. ఫోన్ కాల్స్ ఆధారంగా వారిని ట్రేస్ చేసి గుడివాడ తీసుకొచ్చారు.

గుడివాడకు చెందిన 15 సంవత్సరాల బాలుడిని ఓ వివాహిత ఇటీవల మాయమాటలు చెప్పి హైదరాబాద్ తీసుకెళ్లింది. ఆమెకు అప్పటికే వివాహం అయి నలుగురు పిల్లలున్నారు. ఎందురింట్లో ఉండే పదిహేనేళ్ల బాలుడి పట్ల ఆమె ఆకర్షితురాలైందని, అతడిని లోబరచుకుని తన వెంట తీసుకెళ్లిందని తేలింది. గతంలో ఈ రెండు కుటుంబాల మధ్య ఇదే విషయమై పంచాయితీ జరిగిందని, కానీ కొన్నిరోజులు సైలెంట్ గా ఉండి చివరకు ఆ అబ్బాయిని తీసుకుని ఆ వివాహిత హైదరాబాద్ వెళ్లిపోయిందని నిర్థారించారు. అయితే వారు ఎక్కడున్నారో తేలకపోవడంతో రెండురోజులపాటు ఆ అ్బబాయి తల్లిదండ్రులు, వివాహిత కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు.

హైదరాబాద్ వెళ్లిన తర్వాత రెండు మూడు రోజులు అంతా బాగానే ఉంది. ఇక్కడ గుడివాడలో పోలీసులు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు కానీ, వారిద్దరూ ఎక్కడున్నారో తేలలేదు. చివరకు ఆ పిల్లవాడు తనకు డబ్బులు కావాలని స్నేహితులకు ఫోన్లు, మెసేజ్ లు చేశాడు. చివరకు తల్లిదండ్రులకు ఫోన్ చేసి తాను ఇంటికొచ్చేస్తానని చెప్పారు. దీంతో వారెక్కడున్నారనేది తేలింది.
అప్పటికే ఆ అబ్బాయి కోసం పోలీసుస్ స్పెషల్ పార్టీలు గాలింపు చేపట్టాయి. బాలుడు ఫోన్ చేసిన విషయం తెలుసుకుని ఫోన్ కాల్ ఆధారంగా లొకేషన్ కనిపెట్టారు. నేరుగా హైదరాబాద్ వెళ్లి వారిద్దర్నీ అదుపులోకి తీసుకున్నారు. అక్కడినుంచి ఇద్దర్ని గుడివాడ తీసుకొచ్చారు. వివాహిత జరిగిన విషయాలన్నిటినీ పోలీసులకు చెప్పింది. కావాలనే తాను ఆ అబ్బాయిని తీసుకెళ్లానని ఒప్పుకుంది. దీంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు, రిమాండ్ కి తరలించారు. ఆ అబ్బాయికి కౌన్సెలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: