విశాఖ సాయిప్రియ వ్యవహారంలో ఇప్పుడు పోలీసులకు కొత్త చిక్కొచ్చి పడింది. ఆమెను, ఆమె కొత్త భర్త రవిని పోలీసులు బెంగళూరు నుంచి విశాఖకు తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు ఆమెను ఎవరి వద్దకు పంపించాలనే విషయం పెద్ద సందిగ్ధంలో పడింది. మొదటి భర్త శ్రీనివాసరావుకి అప్పగించాలా, లేక రెండో భర్త రవితో ఉంచి పోలీస్ రక్షణ కల్పించాలా, లేక తల్లిదండ్రులతో పంపించి వేయాలా అని ఆలోచిస్తున్నారు పోలీసులు.

మరో ట్విస్ట్ ఇచ్చిన సాయిప్రియ..
విశాఖపట్నంలో పెళ్లిరోజు సంబరాలనుంచి మాయమైన సాయి ప్రియ అప్పటినుంచి తల్లిదండ్రులకు, భర్తకు, పోలీసులకు ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు ఇస్తూనే ఉంది. విశాఖ నుంచి నెల్లూరు వచ్చిన ఆమె అక్కడినుంచి వెంటనే మకాం మార్చింది. బెంగళూరు వెళ్లిపోయింది. బెంగళూరులో ప్రియుడు రవితో కలసి ప్రత్యక్షమై, అతడినే పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత తల్లిదండ్రులకు ఆడియో మెసేజ్ లు పంపించింది. తమను ఇక వెదకొద్దని, వెంటపడొద్దని చెప్పింది. కానీ అంతలోనే పోలీసులు ఆమె జాడ పసిగట్టారు. బెంగళూరు నుంచి ఆమెను విశాఖ తీసుకొచ్చారు. సాయిప్రియ తల్లిదండ్రులు, రవిపై కిడ్నాప్ కేసు పెట్టడంతో వారిద్దర్నీ తీసుకొచ్చి స్టేషన్లో ఉంచారు. ఇప్పుడు అసలు సాయిప్రియను ఎవరితో పంపించేయాలనేది అసలు సమస్యగా మారింది. తాజాగా ఆమె పోలీస్ స్టేషన్లో మరో బాంబ్ పేల్చింది. తనకు బంధువులనుంచి ప్రాణ హాని ఉందని ఫిర్యాదు చేసింది.

దీంతో పోలీసులకు ఏం చేయాలో అర్థం కావడంలేదు. మొదటి భర్త శ్రీనివాస్ ని పిలిపించి మాట్లాడాలా, అతడికి కౌన్సెలింగ్ ఇవ్వాలా అని ఆలోచిస్తున్నారు పోలీసులు. సాయిప్రియ మేజర్ కావడంతోపాటు, ఆమె పోలీసుల మాట వినేలా లేదు. దీంతో ఆమెను రెండో భర్తతోనే పంపించి వేసే ఆలోచనలో ఉన్నారు. అధికారులను హడావిడి పెట్టించిన సాయిప్రియ ఆ తర్వాత తన తప్పుకి క్షమాపణలు కూడా చెప్పింది. ఇప్పుడు బంధువులపై ఫిర్యాదు చేసి మరో ట్విస్ట్ ఇచ్చింది. మరి పోలీసులు సాయి ప్రియ వ్యవహారంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఏం చేస్తారనేది చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: