ఈ విషాదకర ఘటన మెదక్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. రామాయంపేట కు చెందిన శివకుమార్ ఓ బాలికను రెండు నెలల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇటీవల సదరు బాలిక మేజర్ గా మారింది. అయితే ఇంటికి రావాలంటు శివ కుమార్ ఫోన్ చేసినప్పటికీ ఆమె మాత్రం స్పందించలేదు. దీంతో మనస్తాపానికి గురైన శివకుమార్ హైదరాబాద్ పట్టణ శివారులో ఒక చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే ప్రేమ కారణంగా ఒక్కగానొక్క కొడుకు దూరమవ్వడంతో ఆ తల్లి తట్టుకోలేకపోయింది. దీంతో 42 ఏళ్ళ వరలక్ష్మి గత మూడు రోజుల నుంచి నిద్రాహారాలు మాని కొడుకు కోసం విలపించసాగింది.
కొడుకు కోసమే బ్రతికిన సదరు మహిళ కొడుకు లేక పోవడం తో ఇక జీవితం వృధా అని భావించింది. చివరికి స్థానికంగా ఉన్న చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులు ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చెరువు కట్ట వద్ద చెప్పులు కనిపించడంతో చెరువులో దూకింది అని భావించారు. ఈ క్రమంలో గజ ఈతగాళ్లతో మృతదేహాన్ని గాలింపు చర్యలు చేపట్టగా చివరికి లభ్యమైంది. కాగా భార్య కుమారుడి మరణంతో భర్త లక్ష్మణ్ ప్రస్తుతం తీవ్రత శోకసంద్రంలో మునిగిపోయాడు అని చెప్పాలి.