ఇటీవల కాలంలో మనుషులు ప్రవర్తిస్తున్న తీరు చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ భయాందోళనకు గురి అయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయి అన్న విషయం తెలిసిందే. గతంలో ఎంతగానో చదువుకుని మంచి విజ్ఞానవంతులు అయ్యుండి ఒక కుటుంబం  మూఢనమ్మకాల ఊబిలో కూరుకుపోయి పిల్లల్ని దారుణంగా హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం గా మారిపోయింది. ఇక మొన్నటికి మొన్న పోలీస్ స్టేషన్ లో ఇరుక్కున్న భర్తను  కాపాడేందుకు ఒక భార్య నేనే దుర్గామాత అవతారాన్ని అంటూ చెప్పి చేతిలో బల్లెం పట్టుకుని హడావిడి చేసిన ఘటన కూడా సంచలనంగా మారింది.


 అయితే ఇటీవల కాలంలో సినిమాల ప్రభావము లేకపోతే ఇంకేదైనా కారణమో తెలియదు కానీ మనుషుల ప్రవర్తన తీరు లో మాత్రం అనూహ్యమైన మార్పులు వస్తున్నాయి. వెరసి రోజు రోజుకి వెలుగులోకి వస్తున్న ఘటనలు మాత్రం అందరిని  భయపడుతూ ఉన్నాయి అని చెప్పాలి. కానీ మనుషులు మూఢనమ్మకాల ఊబిలో కూరుకుపోయి విచిత్రంగా ప్రవర్తిస్తూ మానవత్వాన్ని మరిచి దారుణంగా హత్యలకు పాల్పడుతున్నారు. ఇక్కడ  కూడా ఇలాంటిదే జరిగింది. ఇక్కడ ఓ పదిహేనేళ్ల బాలిక ఏకంగా సొంత చెల్లెలు ని దారుణంగా కత్తితో గొంతు కోసి చంపేసింది.


 అయితే సదరు బాలిక అలా చేయడానికి గల కారణం ఏంటో తెలిసి మాత్రం ప్రతి ఒక్కరూ అవాక్కవుతున్నారు అని చెప్పాలి. రాజస్థాన్ లో ఈ దారుణ ఘటన వెలుగుచూసింది. తనకు అమ్మవారు పూనింది అంటూ చెప్పిన బాలిక చెల్లెలి గొంతు కోసి చంపింది.  శంకర్ అనే వ్యక్తి ఇంట్లో దశ మాత విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే శంకర్ కూతురు విగ్రహం వద్ద ఉన్న కత్తి తీసుకుని తాను అమ్మవారి అవతారం అని అందర్నీ చంపేస్తానంటూ బెదిరించింది. ఈ క్రమంలోనే ఇంట్లో నిద్రిస్తున్న ఏడేళ్ల చెల్లి గొంతు కోసి దారుణంగా హత్య చేసింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: