ఇటీవలి కాలంలో ఎక్కడ చూసినా బలవన్మరణాలకు సంబంధించిన ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి అనే విషయం తెలిసిందే. అయితే బలవన్మరణాలు ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపుతున్నాయి.  అదే సమయంలో బలవన్మరణాలకు పాల్పడేందుకు  గల కారణాలు తెలిస్తే మాత్రం ప్రతి ఒకరు ముక్కున వేలేసుకుని పరిస్థితి వస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  చిన్న చిన్న కారణాలకు నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తూ ఉన్నారు  ఎంతోమంది. ఇక ఇలా వెలుగులోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత సభ్య సమాజం తీరు ఎటుపోతుందో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది అని చెప్పాలి.


 తల్లిదండ్రులు మందలించారని.. టీచర్ హోం వర్క్ చేయకపోతే తిట్టిందని.. స్నేహితులు గొడవ జరిగి  మాట్లాడటం లేదని.. పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చాయని ఇలా చిన్నచిన్న కారణాలకే ఎంతోమంది బలవన్మరణాలకు పాల్పడుతు ఉండటం  చూస్తూ ఉన్నాము. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఎంతో మంది జీవితాలను ముగిస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది అన్నది తెలుస్తుంది. భార్య చేసిన చికెన్ పకోడీ సరిగ్గా చేయ లేదు అన్న కారణంతో చివరికి భర్త ఆత్మహత్య చేసుకున్నాడు.


 ఈ ఘటన బెంగళూరులో వెలుగులోకి వచ్చింది. బన్నేరుఘట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అరేకేరె లే అవుట్ లో ఉండే సురేష్ అనే 48 ఏళ్ల వ్యక్తి బొమ్మనహళ్లి లోనే గార్మెంట్స్ కర్మాగారంలో పని చేస్తూ ఉన్నాడు. భార్యతో కలిసి ఉంటున్నాడు. ఇటీవల చికెన్ పకోడీ చేయాలి అంటూ భార్య శాలిని కోరాడు సురేష్.  ఇక భర్త కోరిక మేరకు భార్య ఆ వంటకం చేసి పెట్టింది. ఈ క్రమంలోనే చికెన్ పకోడీ బాగాలేదని ఆగ్రహంతో ఊగిపోయాడు భర్త. భార్యను చితకబాదాడు కత్తితో తల చేతుల పై దాడి చేసి పరారయ్యాడు. కాగా శాలిని  కేకలు విని ఇరుగు పొరుగు వారు ఆమెను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఆమె వాంగ్మూలం మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే పరారీలో ఉన్న భర్త సురేష్ ఇంటి సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: