వేదమంత్రాల సాక్షిగా జరిగిన పెళ్లి సమయంలో ఎన్నో ప్రమాణాలు చేస్తూ ఉంటాడు భర్త. కష్టం వచ్చినా సుఖం వచ్చిన భార్యను సంతోషంగా చూసుకుంటాను అని చెబుతూ ఉంటాడు. అన్ని విషయాలలో కూడా భార్యకు తోడునీడగా ఉంటానని చెబుతూ ఉంటాడు. ఈ క్రమంలోనే ఇలాంటి ప్రమాణాలు కేవలం పెళ్లి వరకు మాత్రమే కనిపిస్తు ఉంటాయి. పెళ్లయిన తర్వాత చిన్నచిన్న కారణాలకే మనస్పర్థల తో విడిపోతున్న వారే నేటి రోజుల్లో ఎక్కువగా కనిపిస్తున్నారు అని చెప్పాలి. వెరసి రోజు రోజుకి అన్యోన్యతకు కేరాఫ్ అడ్రస్ గా ఉండాల్సిన దాంపత్య బంధం కాస్త హత్యలకు ఆత్మహత్యలకు చిరునామాగా మారిపోతుంది.


 మరికొంతమంది మాత్రం కట్టుకున్న వారితోనే జీవితం అంటూ చివరికి చావులోను చావు లోను తోడు నీడ గా ఉంటున్నారు. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. భార్య లేకుండా తాను జీవితంలో ముందుకు వెళ్ళలేను అని  భావించాడు సదరు వ్యక్తి. ఈ క్రమంలోనే భార్య చనిపోయిన తర్వాత మృతదేహాన్ని ఎవరికి తెలియకుండా ఇంట్లోనే పాతి పెట్టాడు.  ఘటన మధ్యప్రదేశ్ లోని ఇండోర్ జిల్లా లో వెలుగులోకి వచ్చింది.  స్కూల్ టీచర్గా పనిచేస్తున్నారు ఓంకార్ దాస్.. అతని భార్య పై అమితమైన ప్రేమ కలిగి ఉండేవాడు. ఈ క్రమంలోనే ఇరుగుపొరుగువారు ఎంత వారించినా కూడా చనిపోయిన తన భార్యను ఇంట్లోనే సమాధి చేసి పూలతో అలంకరించారు.


 ప్రతి రోజు కూడా భార్య మృతదేహం పక్కనే అతను నిద్రిస్తూ ఉండేవాడు అని చెప్పాలి. కష్టసుఖాల్లో కలిసి ఉండి 25ఏళ్ల పాటు కాపురం చేసిన భార్య లేకుండా తన అడుగు ముందుకు పడదు  అంటూ ఓంకార్ దాస్ చెబుతూ ఉండేవాడు. అయితే స్థానికులు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఓంకార్ వారిస్తున్నప్పటికీ కూడా లెక్క చేయని అధికారులు సదరు మహిళ మృతదేహాన్ని వెలికి తీశారు.. అయితే గత పన్నెండేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఓంకార్ భార్య రుక్మిణీ  తుదిశ్వాస విడిచారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: