ఇటీవలికాలంలో దేశం మొత్తం టెక్నాలజీ వెంట పరుగులు పెడుతున్న సమయంలో కొంతమంది మాత్రం ఇంకా మంత్రాలకు చింతకాయలు రాలుతాయ్ అని నమ్ముతూ ఉన్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే మూఢనమ్మకాల నేపథ్యంలో ఎన్నో దారుణాలకు కూడా పాల్పడుతుంటారు.  క్షుద్ర పూజల పేరుతో ఏకంగా నరబలి ఇవ్వడానికి కూడా సిద్ధమైపోతున్నారు అన్న విషయం తెలిసిందే. ఇలాంటి తరహా ఘటనలు వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ భయాందోళనకు గురి అవ్వాల్సినా పరిస్థితి ఏర్పడింది.  ఇటీవల యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం లో కూడా ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది.


 జూలూరు లో అనూష అనే 30 ఏళ్ల మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అయితే అత్తా క్షుద్ర పూజలు చేసిన నర బలి ఇవ్వడం కారణంగానే ఆమె ప్రాణాలు కోల్పోయిందని గ్రామస్తులు అందరూ కూడా అనుమానం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే.. ఎస్ లింగోటం గ్రామానికి చెందిన అనూష జూలూరు కు చెందిన బాబురావు తో 2017 లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నాడు.  బాబురావు విద్యుత్ శాఖలో ఔట్సోర్సింగ్ ఆపరేటర్ గా పని చేస్తున్నాడు. ఇటీవలే వీరి మధ్య మనస్పర్థలు రావడంతో తరచూ భార్యను కొడుతూ వేధిస్తూ ఉండేవాడు.


 అయితే గత వారం రోజులుగా అమ్మ తల్లి సోకి అనారోగ్యంతో బాధ పడుతుంది అనూష. ఈ క్రమంలోనే బాబు రావు తన భార్య కి విషమంగా ఉందని బావమరిదికి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పాడు. అతను వచ్చేసరికి గదిలో మృతి చెందింది అనూష. అయితే అనూషక అత్త క్షుద్ర పూజలు చేస్తూ ఉంటుందని గ్రామస్తులు చెబుతున్నారు. ఇక అమావాస్య కావడం అనూష మృతదేహం పక్క నిమ్మకాయలు  కొబ్బరికాయలు ఉండడం చూసి ఇది అత్త పనే అని  అందరూ నిర్ధారించారు.  కానీ ఆ తర్వాత మాత్రం ఇది ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు భర్త ఆమె ఒంటిపై యాసిడ్ పోసినట్లు స్థానికులు చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: