భారత్ పాకిస్తాన్ మ్యాచ్ క్రికెట్ ప్రేక్షకులందరూ ఎంత ఎంజాయ్ చేస్తూ ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దాయాదుల పోరు జరుగుతున్న సమయంలో భారత్లో ఎలాంటి పరిస్థితి ఉంటుందో పాకిస్తాన్ కు కూడా అలాంటి పరిస్థితి ఉంటుంది అని చెప్పాలి. సాధారణంగా ఇంట్లో టీవీ ముందు కూర్చుని మ్యాచ్ వీక్షించడం కంటే ఏకంగా స్నేహితులు అందరితో కలిసి ఒక చోట చేరి ఇక దాయాదుల పోరు వీక్షిస్తూ తెగ ఎంజాయ్ చేయాలని ప్రతి ఒక్కరు భావిస్తూ ఉంటారు. అంతేకాదు ఇక తమ అభిమాన క్రికెటర్లు ఎవరైనా సిక్సర్లు ఫోర్లు కొట్టడం లేదా వికెట్లు తీయడం లాంటివి చేస్తే సంబరపడిపోతూ ఉంటారు అని చెప్పాలి.  తమ అభిమాన జట్టు విజయం సాధించింది అంటే వారి ఆనందానికి అవధులు ఉండవు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.



 ఇటీవల భారత్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగిన సమయంలో కూడా ఇలాంటిదే జరిగింది అని చెప్పాలి. ఎంతోమంది స్నేహితులు ఒకచోట చేరి ఒక పెద్ద టీవీ ఏర్పాటు చేసుకుని క్రికెట్ మ్యాచ్ లు చూడటం లాంటివి కూడా చేశారు. ఈ క్రమంలోనే టీమిండియా గెలవగానే ఎంతో మంది భారత అభిమానులు అందరూ కూడా భారీగానే సంబరాలు చేసుకున్నారు అని చెప్పాలి.  ఇటీవలే ఇలా టీమిండియా గెలిచింది అని సంబరాలు చేసుకున్న ఒక వ్యక్తి చివరికి ప్రాణాలు కోల్పోయిన ఘటన కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో వెలుగులోకి వచ్చింది.


 పాకిస్థాన్పై భారత జట్టు గెలిచింది అని ఆనందం లో మద్యం సేవించి రాత్రి పడుకున్న వ్యక్తి ఉదయాన్నే ఛాతి నొప్పి రావడంతో తరలించగా అప్పటికే మృతి చెందాడు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది ఈ ఘటన. కర్ణాటకకు చెందిన ప్రకాష్ నాలుగేళ్ల క్రితం బతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చాడు  అంజయ్య నగర్ లోని పద్మా నిలయంలో ఎయిర్టెల్ డిటిహెచ్ టెక్నీషియన్గా పని చేస్తున్నాడు. ఇటీవల భారత్ పాకిస్తాన్ మ్యాచ్ స్నేహితులతో కలిసి వీక్షించారు.  తెల్లవారుజామున రెండు గంటల వరకు మద్యం తాగి పడుకున్నాడు. ఛాతిలో నొప్పి రావడంతో ప్రకాష్ నిద్రకు ఉపక్రమించాడు. ఉదయం లేచి కాసేపు వాకింగ్ చేసి మళ్లీ ఛాతి నొప్పి వస్తుందని విశ్రాంతి తీసుకున్నాడు. ఇక అంతలోనే అపస్మారక స్థితిలోకి వెల్లాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తుచేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: