ప్రేమ అనేది ఎన్నో మధురమైన జ్ఞాపకాలు కేరాఫ్ అడ్రస్.. ఒక్కసారి ప్రేమలో పడిన తర్వాత ఈ లోకాన్ని మర్చిపోతూ ఉంటారు అని అంటారు ప్రేమికులు. ఇక జంట ఒకచోట చేరితే చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మొత్తం మర్చిపోయి ప్రేమ లోకంలో విహరిస్తూ ఉంటారు. ప్రేమ గురించి చెప్పుకోవాలంటే ఇలాంటి తీయ్యటి మాటలే కాదు పరువు హత్యలతో జరుగుతున్న రక్తపాతాలు ఎంతోమంది మనస్థాపంతో క్షణికావేశంలో తీసుకున్న ఆత్మహత్యల కారణంగా తల్లిదండ్రులకు కడుపు కోత మిగులుతుంది. ఒక రకంగా చెప్పాలంటే నేటి రోజుల్లో ప్రేమ అనేది ప్రాణాలు పోవడానికి కేరాఫ్ అడ్రస్ గా మారింది.


 ప్రేమ విఫలమైందని కొంతమంది ప్రేమించిన వారు మోసం చేశారని మరికొంతమంది.. ఇక తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు అని కొంతమంది.. ఇలా వివిధ కారణాలతో క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుంటూ నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్నారు. ఇక్కడ ప్రేమ మరో ప్రాణం పోవడానికి కారణమైంది. ప్రేమించేటప్పుడు సదరు యువకుడు కులాన్ని చూసుకోలేదు. కానీ పెళ్లి విషయంలో మాత్రం తల్లిదండ్రులు కులం పేరుతో అడ్డు చెప్పారు. దీంతో మనస్తాపం చెందిన యువకుడు చివరికి గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.



 అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మహేంద్ర అనే 19 ఏళ్ల యువకుడు ఆటో డ్రైవర్ గా పని చేస్తున్నాడు. అదే గ్రామానికి  చెందిన ఓ యువతిని ప్రేమించాడు. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారట. ఇంట్లో వారికి ప్రేమ విషయం చెబితే కులాలు వేరు కావడంతో తల్లిదండ్రులు అంగీకరించలేదు. ఇక వాళ్ళు మాత్రం పెద్దలను ఎదిరించి సైతం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఇరు కుటుంబాల పెద్దలు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు చెప్పిన ఆ ప్రేమ జంట మాత్రం వినలేదు. దీంతో ప్రియురాలు  దూరమైపోతుంది అనే మనస్థాపంతో చివరికి ఎవరూ లేని సమయంలో కత్తితో గొంతు కోసుకున్నాడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: