ఇటీవల పెద్దలను ఒప్పించి మరీ ఎంతో ఘనం గా ప్రేమ పెళ్లి చేసుకున్నారు ఇక్కడొక జంట. పదిహేను రోజులైనా గడవక ముందే చివరికి ఆత్మహత్యకు పాల్పడ్డారు. భార్య మరణించగా ప్రస్తుతం భర్త కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న విషాదకర ఘటన పల్నాడు జిల్లా పిడుగు రాళ్ళ రజక కాలనీలో వెలుగు లోకి వచ్చింది. నాగేశ్వరరావు మరణించడం తో భార్య నాగమ్మ కూలి పనులు చేసుకుంటూ ఉంది. ఆమెకు కుమార్తె అఖిల ఉంది అదే ప్రాంతానికి చెందిన వినయ్ ను అఖిల ప్రేమించింది. పెద్దలు కూడా వీరి ప్రేమను అంగీకరించారు.
చివరికి ఇటీవల ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఇటీవలే నాగమ్మ నవ దంపతులను భోజనానికి పిలిచేందుకు గది దగ్గరకు వెళ్ళింది. అయితే ఎంత పిలిచినా తలుపులు తీయక పోవడంతో ఏం జరిగి ఉంటుందని తలుపు సందులోంచి చూసింది. గదిలో ఇనుప కడ్డీకి ఇద్దరు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు కనిపించింది. దీంతో భయం తో ఒక్క సారిగా కేకలు పెట్టింది. ఇరుగు పొరుగు వారు వచ్చి తలుపులు బద్దలు కొట్టి మృత దేహాలను కిందకు దింపారు. కట్నం విషయంలో ఇరు కుటుంబాల మధ్య సమస్య తలెత్తడం తో మనస్థాపం చెందిన దంపతులు ఇలా ఆత్మహత్యకు పాల్పడటం సంచలనం గా మారింది.