అప్పుడు మనుషుల మధ్య ఎంతో ఆప్యాయత అనురాగం తో కూడిన బంధాలు ఎక్కువగా కనిపిస్తూ ఉండేవి. కానీ ఇటీవల కాలంలో మనుషులు మధ్య కుళ్ళు కుతంత్రాలు తప్ప ఇంకా ఏమీ కనిపించడం లేదు అని చెప్పడం లో అతి శయోక్తి లేదు. మానవత్వానికి మైళ్ల దూరం వెళ్లి పోతున్న మనుషులు సాటి మనుషులను దారుణంగా హతమార్చడం కూడా వెనకాడని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సొంత వాళ్ళ విషయంలో కూడా కాస్త అయినా జాలి దయ చూపించడం లేదు నేటి రోజుల్లో మనుషులు. ఇక నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలో ప్రతి ఒక్కరిని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.



 తుముకూరు సమీపంలో కనిపించకుండా పోయిన మహిళా కానిస్టేబుల్ దారుణ హత్యకు గురైనట్లు తెలుస్తోంది. హత్య చేసింది ఎవరో కాదు చిన్నాన్న కుమారుడు మంజునాథ్ అన్న విషయం విచారణలో బయట పడింది. మహిళను హత్య చేసిన తర్వాత అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.వివరాల్లోకి వెళితే.. సుధా అనే మహిళా కానిస్టేబుల్ గా పనిచేస్తుంది.  ఇటీవలే ఈ నెల 13వ తేదీన విధులు ముగించుకుని ఇంటికి బయలుదేరింది.  ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. రెండేళ్ల కిందటే భర్త చనిపోయాడు. అయితే తల్లి ఇంటికి రాకపోవడంతో వెంటనే పిల్లలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.


 ఇక పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా కర్ణాటక రాష్ట్రం హాసన్ జిల్లాలోని రహదారి పక్కన సుధా మృతదేహం లభ్యమైంది. ఇంకోవైపు శివమొగ్గ లాడ్జీలో మంజునాథ ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. పోలీసు విచారణలో చిక్కుముడి వీడింది సుధా మంజునాథ స్థలం జిల్లాలోని చిక్కనాయకంహళ్లి అని.. వీరికి డబ్బులు ఆస్తుల విషయంలో గొడవలు ఉన్నట్లు సమాచారం. దీనిపై మాట్లాడదామని మంజునాథ్ కార్లో తీసుకెళ్లి హత్య చేసినట్లు మంజునాథ్ వద్ద డెత్ నోట్ దొరికింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: