తల్లి కడుపు నుంచి ఈ భూమి మీదకు వచ్చిన తర్వాత మనిషికి మృత్యువు ఎప్పుడు ఎలా సంభవిస్తుంది అన్నది ఎవరు ఊహించని విధంగానే ఉంటుంది అన్న విషయం తెలిసిందే. సంతోషం గా సాగిపోతుంది.. ఆరోగ్యం కూడా బాగానే ఉంది ఇక ఇలాంటి సమయంలో మృత్యువుదరిచేరడం కష్టమని అందరూ అనుకుంటున్న సమయంలో అనుకోని విధంగా మృత్యువు ఎంతోమంది జీవితాలను ముగిస్తూ ఉంటుంది. అనుకోని ఘటనలు  ఘటనలు క్షణ కాల వ్యవధిలో ప్రాణాలను తీసేస్తు  కుటుంబాల్లో విషాదాన్ని నింపుతూ ఉంటాయ్ అన్న విషయం తెలిసిందే.


 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది అనే చెప్పాలి. ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య ఎక్కువగా పెరిగిపోతుంది. రోడ్డు ప్రమాదాల కారణంగా చనిపోతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. అయితే కేవలం రోడ్డు ప్రమాదాలు మాత్రమే కాదు రైళ్లు విమానాలు ప్రమాదాల కారణంగా కూడా ఎంతోమంది చివరికి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవలే రైలు ప్రమాదంలో ముగ్గురు రైల్వే కార్మికుల మృతి ఘటన గురించి మరవకముందే మరో విషాదకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లి చూపులకు వెళ్తున్న ఒక వ్యక్తి ఎంతో సంతోషంగా ఉన్నాడు.


 కానీ అతని సంతోషాన్ని చూసి విధి ఓర్వ లేక పోయింది. చివరికి రైలులో పెళ్లిచూపులు కి వెళ్తున్న సమయంలో చివరికి రైలు నుంచి జారి కింద పడిపోయాడు. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు సదరు వ్యక్తి. ఈ ఘటన కొవ్వూరు మండలం పశువేదల రైల్వే స్టేషన్ లో చోటుచేసుకుంది. ఒరిస్సా రాష్ట్రం గంజాం జిల్లా శీతల సంతోషి పూర్ గ్రామానికి చెందిన సుశాంత్ ఉపాధి  కోసం చెన్నై వెళ్లి అక్కడ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కాగా పెళ్లి చూపుల కోసం చెన్నై నుంచి ఒరిస్సాకు వెళ్లడానికి బరంపురం హౌరా మెయిల్ లో ప్రయాణమయ్యాడు. అయితే కొవ్వూరు మండలం పసివేదల రైల్వేస్టేషన్ సమీపంలోకి రాగానే ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడి గాయాలు కాగా అంబులెన్స్  ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: