నేటి రోజుల్లో మానవ బంధాల కు ఎక్కడా కనీసం విలువ ఉండటం లేదు అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆకట్టుకున్న బంధానికి విలువ ఇవ్వకుండా మనుషులు ప్రవర్తిస్తున్న తీరు సభ్యసమాజాన్ని సిగ్గు పడేలా చేస్తుంది. రోజు రోజుకి వెలుగులోకి వస్తున్న ఘటనలు ప్రతి ఒక్కరిని అవాక్కయ్యేలా చేస్తూ ఉన్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. వివాహేతర సంబంధం పెట్టుకోవడం తప్పు అని అందరికీ తెలుసు. కానీ ఇటీవలి కాలంలో మాత్రం క్షణకాల  సుఖం కోసం పరాయి వ్యక్తుల మోజులో పడిపోయి చివరికి కట్టుకున్న వారిని దారుణంగా హతమార్చిన ఘటనలు కోకొల్లలుగా వెలుగులోకి వస్తున్నాయి.


 ఇక ఇలాంటి ఘటనలు చూసినప్పుడు సభ్యసమాజం భవిష్యత్తు ఎటు పోతుందో అని ఆలోచించడానికే ప్రతి ఒక్కరికీ భయమేస్తుంది  అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి సంఘటన వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధం మోజులో పడిపోయిన మహిళ భర్త అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే ప్రియుడితో కలిసి పథకం వేసి దారుణంగా భర్తను చంపి చివరికి మృతదేహం కూడా దొరకకుండా తగలబెట్టేసింది. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా ఐదు నెలల తర్వాత మృతుడి సెల్ఫోన్ ఆధారంగా చివరికి మర్డర్ మిస్టరీని ఛేదించారు పోలీసులు.


 విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం ప్రాంతానికి చెందిన  రాజు శ్రీకాకుళం జిల్లా హిరమండలం లోని చిన్న కొల్లివలస లో కొన్నేళ్ల కిందట వచ్చి అక్కడే స్థిరపడి పోయాడు. అతనికి సుజాత అనే మహిళతో పదేళ్ల  కిందట వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇటీవలికాలంలో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. ఇలాంటి సమయంలోనే సుజాతకు  రాముతో వివాహేతర సంబంధం ఏర్పడింది.  అయితే హైదరాబాదులో కూలి పనులు చేస్తున్న రాజు ఇటీవలే కీరమండలంలోని భార్య వద్దకు వచ్చాడు. అయితే అప్పటికే భర్త సుఖానికి అడ్డుగా ఉన్నాడని భావించింది భార్య.   ప్రియుడు రాము అతని స్నేహితుడు నూకరాజు తో కలిసి పథకం వేసి దారుణంగా హత్య చేసి పెట్రోల్ పోసి తగలబెట్టింది. పోలీసు విచారణలో అసలు నిజాలు బయటపడ్డాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: