ఇటీవల కాలంలో మనుషులు విచక్షణ కోల్పోయి చివరికి వావి వరసలు మరిచి మరి దారుణంగా ప్రవర్తిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. బంధాలకు బంధుత్వాలకు విలువ ఇవ్వకుండా క్షణకాల సుఖం కోసం పరితపించిపోతున్న ఘటనలు సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా దాంపత్య బంధం లోకి అడుగుపెట్టిన తర్వాత కట్టుకున్న బంధానికి కట్టుబడి ఉండకుండా చివరికి పరాయి వ్యక్తుల మోజులో పడిపోయి ఎన్నో దారుణాలకు పాల్పడుతున్నారు మనుషులు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. వాళ్ళిద్దరూ భార్యాభర్తలు. పెళ్ళై ఎన్నో రోజులు అవుతుంది. కొన్నాళ్లకి భర్త అనారోగ్యం కారణంగా మంచానికి పరిమితం అయ్యాడు.


 దీంతో సదరు మహిళ పడక సుఖానికి దూరమైంది. ఇంకేముంది భార్య పని చేసే చోట వేరే మగాడితో ప్రేమాయణం నడపడం మొదలుపెట్టింది. ఇక మంచానికి పరిమితమైన భర్తకు ఈ చీకటి రాసలీలలు తెలియకుండా ఎంతో జాగ్రత్తలు తీసుకుంది. చివరికి భర్త తండ్రికి విషయం తెలిసింది. ఎన్నోసార్లు పద్ధతి మార్చుకోవాలంటూ కోడలని హెచ్చరించాడు. అయినప్పటికీ ఆమె బుద్ధి మారలేదు. చివరికి పరుగు బజారున పడుతుందని భావించి దారుణంగా హత్య చేసాడు. ఈ ఘటన తమిళనాడులో వెలుగులోకి వచ్చింది.


 తెన్ కాశి జిల్లా సెంగుట్టాయి పరిధిలోని లాలా గుడి ఇరివు గ్రామంలో ఉండే ఇస్సాకి రాజ్ అనే వ్యక్తి గతంలో మహిళను వివాహం చేసుకున్నాడు. అయితే దాంపత్య జీవితం సాఫీగానే సాగింది. కానీ ఆ తర్వాత ఇస్సాకి రాజ్ అనారోగ్యం బారిన పడ్డాడు. దీంతో మొదటి భార్య విడాకులు ఇచ్చింది. దీంతో మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. అయితే పద్మావతి భర్తను దగ్గరుండి చూసుకోకుండా తన పని చేసే చోట వేరే యువకుడితో పరిచయం పెంచుకుని వివాహేతర సంబంధానికి తెరలేపింది. చివరికి ఎంతో రహస్యంగా ఈ బంధాన్ని కొనసాగించినప్పటికీ ఎట్టకేలకు పద్మావతి భర్త తండ్రికి ఈ విషయం తెలిసింది. తీరు మార్చుకోవాలని మామ హెచ్చరించాడు. అయినా మార్పు రాకపోవడంతో చివరికి దారుణంగా హత్య చేశాడు. తర్వాత పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: