ఇటీవల కాలంలో బంధాలకు బంధుత్వాలకు విలువ ఇవ్వని మనుషులు క్షణకాల సుఖం కోసం నీచాతి నీచమైన పనులు చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. కట్టుకున్న బంధానికి కట్టుబడి ఉండకుండా పరాయి వ్యక్తులతో సుఖానికి అలవాటు పడి చివరికి అక్రమ సంబంధాలకు తెర లేపుతున్నారు. అక్రమ సంబంధాల మాయలో మునిగిపోయి చివరికి కట్టుకున్న వారిని కూడా దారుణంగా హతమార్చేందుకు సిద్ధమవుతున్నారు అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే నేటి రోజుల్లొ అక్రమ సంబంధాలు నేపథ్యంలో ఎన్నో దారుణ ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా కఠిన వెలుగు చూసింది. పరాయి మగాడితో సాన్నిహిత్య సంబంధం కోసం వెతుకులాట ప్రారంభించిన ఒక మహిళ ఒకరితో కాదు ఏకంగా ఇద్దరితో ఎఫైర్ పెట్టుకుంది. అంతటితో ఆగకుండా ప్రియుడిని మరో పేరుతో దారుణంగా హత్య చేయించింది. చెన్నై నగరంలో ఈ దారుణ ఘటన వెలుగు చూసింది. సాలి గ్రామం లో శారదాంబాల్ వీధిలో ఉండే సౌందర్య అనే మహిళ కోడంబక్కం ప్రాంతంలో పారిశుద్ధ్య కార్మికురాలుగా పనిచేస్తుంది.


 ఆమెకు గతంలోనే పెళ్లయింది. కానీ ఏం జరిగిందో భర్తకు దూరంగా ఉంటూ వేరు కాపురం పెట్టేసింది. ఇక ఒంటరిగా ఉండలేకపోయింది. దీంతో విజయ్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధానికి తెరలేపింది.. ఇక భర్తకు దూరంగా ఉంటుండడంతో ప్రియుడుతో అడ్డు అదుపు లేకుండా ఎంజాయ్ చేయ సాగింది. ఇక కొన్నాళ్ళకి విజయ్ తోనే కాదు ప్రభు అనే యువకుడితో కూడా అఫైర్ పెట్టుకుంది సౌందర్య. విజయ్ కు తెలియకుండా అతనితో కూడా రాసలీలలు కొనసాగించింది.


 కానీ కొన్నాళ్ళకి మాత్రం ప్రభుకి సౌందర్యతో విజయ్ అనే యువకుడు కూడా ఎఫైర్ పెట్టుకున్నాడు అనే విషయం తెలిసింది. దీంతో సౌందర్యని కలవకుండా ఉండాలంటే విజయ్ ను చంపేయాలి అని ప్రభు నిర్ణయించుకున్నాడు. సమయం సందర్భం కోసం ఎదురుచూసాడు. విజయ్ సౌందర్య ఇటీవల ఏకాంతంగా ఉన్న సమయంలో అక్కడికి చేరుకున్న ప్రభు దారుణంగా విజయ్ ని హత్య చేశాడు. ఇక ఈ హత్య కేసు పోలీసుల వరకు వెళ్లడంతో దర్యాప్తు జరుపగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: