చివరికి మనస్థాపంతో ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నా ఘటనలు కూడా వెలుగు లోకి వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే కామంతో కళ్ళు మూసుకు పోతున్న మానవ మృగాలు ఇటీవల రెచ్చిపోతున్నారు. ఇప్పటికే నెలలు నిండాని పసికందుల నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరిని వదలడం లేదు. అంతటితో ఆగకుండా ఏకంగా మగవారిపై కూడా అత్యాచారాలు చేస్తున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఇలాంటి దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఓ బాలుడు పై అతని స్నేహితులు అత్యాచారం చేశారు.
ఈ క్రమంలోనే ఈ సామూహిక అత్యాచారంలో తీవ్రంగా గాయపడిన సదరు బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చివరికి మృత్యువాత పడ్డాడు. కాగా ఈ ఘటన కాస్త సంచలనగా మారిపోయింది అని చెప్పాలి. అయితే దీనిపై ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ స్పందిస్తూ తీవ్ర విచారం వ్యక్తం చేసారు. నిందితులను కఠినంగా శిక్షించాలి అంటూ పోలీసులను డిమాండ్ చేశారు. అయితే బాలుడు పై అత్యాచారం చేసిన వారందరూ కూడా 10 నుంచి 12 ఏళ్ల లోపు వయసు వారే అని పోలీసులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని మరింత లోతుగా ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు.