భార్యాభర్తల బంధం అనేది అన్యోన్యతకు కేరాఫ్ అడ్రస్ గా ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ప్రతి మనిషి జీవితంలో ఎన్ని రకాల బంధాలు ఉన్న కడవరకు తోడునీడగా ఉంటూ కష్టసుఖాల్లో పాలుపంచుకునేది మాత్రం కేవలం కట్టుకున్న వారు మాత్రమే అని ఎంతో మంది పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే కొంతమంది దాంపత్య బంధాన్ని చూస్తూ ఉంటే ఇది నిజమే అని అనిపిస్తూ ఉంటుంది. పెళ్లితో ప్రతి ఒక్కరికి బాధ్యతలు పెరిగిన పెళ్లి చేసుకుంటేనే జీవితానికి అసలైన అర్థం దొరుకుతుంది అని ఎంతో మంది పెద్దలు చెబుతూ ఉంటారు.



 అయితే ఇలా దాంపత్య బంధం గురించి మాట్లాడుకోవాలంటే ఎంత చెప్పినా తక్కువే. కానీ ఇటీవల దంపతుల గురించి మాట్లాడుకోవాలంటే మాత్రం ప్రతి ఒక్కరు వెన్నులో వెనుక పుడుతుంది.  ఎందుకంటే ఇటీవల కాలంలో  వెలుగులోకి వస్తున్న ఘటనలు అలాంటివి. ఏకంగా కష్టసుఖాల్లో తోడుండాల్సిన కట్టుకున్న వారే కాలయముడుగా మారిపోతూ దారుణంగా కడతేరుస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయ్ అని చెప్పాలి  గుంటూరు జిల్లా తెనాలిలో కూడా ఇలాంటి ఓ దారుణ హత్య వెలుగు చూసింది. డబ్బుల కోసం ఏకంగా కట్టుకున్న భార్యను దారుణంగా హతమార్చాడు ఓ కిరాతకుడు .


 స్థలం అమ్మి డబ్బులు ఇవ్వాలని భార్యతో గత కొంతకాలం నుంచి గొడవ పడుతూ వస్తున్న భర్త ఇక విచక్షణ కోల్పోయాడు. ఏకంగా కట్టుకున్న భార్య విషయంలో యమకింకరుడుగా మారిపోయాడు. బ్యూటీ పార్లర్ నడుపుతున్న ఆమెను దారుణంగా కత్తితో పొడిచి చంపేశాడు. ఈ ఘటనలో రక్తపు మడుగులో కొనప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది సదరు మహిళ. అనంతరం తనతో పాటు తెచ్చుకున్న ఒక పూల దండను భార్య శవం పై వేసి అక్కడే కాసేపు మౌనంగా ఉంది నివాళులు అర్పించాడు. ఇక అనంతరం తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్కు వెళ్లిన సదరు వ్యక్తి పోలీసులు ఎదుట లొంగిపోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: