సాధారణంగా భార్యాభర్తల బంధం అంటే ఇద్దరు కూడా కష్టసుఖాల్లో ఒకరికి ఒకరు తోడునీడగా నిలబడి ఎలాంటి సమస్య వచ్చినా.. నేనున్నాను అనే భరోసాను ఇవ్వాలి. ఇక ఇలాంటివి ఉన్నప్పుడే భార్యాభర్తల బంధం సాఫీగా సాగిపోతూ ఉంటుంది. కానీ ఇటీవల కాలంలో మాత్రం ఇలాంటి భార్యాభర్తలలో ఎక్కడ కనిపించడం లేదు అని చెప్పాలి. ఎందుకంటే కట్టుకున్న బంధానికి విలువ ఇవ్వకుండా పరాయి వ్యక్తుల మోజులో పడిపోతున్న ఎంతోమంది చివరికి అక్రమ సంబంధాలకు సరే లేపుతూ ఉన్నారు అని చెప్పాలి. అంతేకాదు ఇక కట్టుకున్న వారిని పిల్లలను కూడా కాదని నీచమైన పనులు చేస్తూ ఉన్నారు.


 అతడితో ఆగకుండా ఇక కడవరకు తోడుంటాము అని ప్రమాణం చేసిన వారు చివరికి కట్టుకున్న వారిని దారుణంగా కడ తేరుస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి అని చెప్పాలి  ఇక్కడ ఇలాంటి ఒక దారుణ ఘటన వెలుగు చూసింది. ఒక మహిళ అనారోగ్యంతో బాధపడుతున్న భర్తను అత్యంత ఘోరంగా హతమార్చిన ఘటన ప్రతి ఒక్కరిని ఉలిక్కిపడేలా చేసింది. అంతేకాదు హత్య చేసిన అనంతరం అసలు సందేహం రాకుండా పకడ్బందీ ప్లాన్ అమలు చేసింది. ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్లో చోటుచేసుకుంది ఈ ఘటన.


 స్థానిక కళ్యాణ్పూర్ శిబిలి రోడ్డు ప్రాంతానికి చెందిన రిషబ్, సప్న దంపతులు. ఇక వీరిద్దరూ ఇటీవలే ఒక వివాహ వేడుకకు హాజరై తిరిగి వస్తుండగా గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు.. ఇక ఈ ఘటనలో రిషబ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నాడు. అయితే ఇటీవల ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన రెండు రోజులకే ప్రాణాలు కోల్పోయాడు. అయితే అనారోగ్యం వల్లే భర్త చనిపోయాడని అందరూ అనుకున్నారు. కానీ పోలీసులు కేసు నమోదు చేసుకుని ఎంక్వయిరీ చేపట్టడంతో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. అనుకున్న దానికంటే మెడిసిన్ ఓవర్డోస్ ఇచ్చి హతమార్చింది భార్య. ఏమి తెలియనట్లు మళ్ళీ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది.. కానీ పోలీసులు విచారణలో అసలు నిజం బయటపడడంతో చివరికి ఆమెను అరెస్టు చేశారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: