ప్రతి మనిషి జీవితంలో ఎన్ని రకాల బంధాలు ఉన్నప్పటికీ భార్యాభర్తల బంధం మాత్రం ఎప్పటికీ ప్రత్యేకమే అని చెప్పాలి   అప్పటివరకు ముక్కు ముఖం తెలియని వారు ఏకంగా పెద్దలు చెప్పారు అని పెళ్లి చేసుకొని దాంపత్య బంధం లోకి అడుగుపెడుతూ ఉంటారు. ఇలా దంపతులుగా మారిన వారు ఇక కడవరకు కూడా కష్టసుఖాల్లో ఒకరికి ఒకరు తోడునీడగా నిలుస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇలా ప్రతి మనిషి జీవితంలో ఎన్ని బంధాల దూరమైనా అటు కట్టుకున్న బంధం మాత్రం కడవరకు తోడు ఉంటుందని పెద్దలు కూడా చెబుతూ ఉంటారు.


 అయితే ఇటీవల కాలంలో భార్యాభర్తల మధ్య అన్యోన్యత అస్సలు కనిపించడం లేదు అని చెప్పాలి. అయితే భార్యాభర్తల మధ్య గొడవలు జరిగినప్పుడే వారి బంధం మరింత బలపడేందుకు అవకాశం ఉంటుందని మానసిక నిపుణులు కూడా చెబుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో భార్యాభర్తల మధ్య తలెత్తుతున్న చిన్నపాటి గొడవలలు ఎన్నో దారుణాలకు కూడా కారణం అవుతున్నాయి అని చెప్పాలి. ఇక్కడ మాత్రం మరో విచిత్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఏకంగా భార్యపై అలిగిన భర్త 42 ఏళ్లుగా ఇంట్లో అన్నం తినకుండానే ఉంటున్నాడు.


 కేవలం అటుకులు మాత్రమే తింటూ చాయ్ తాగుతూ ఇక 42 ఏళ్లుగా జీవిస్తూ ఉన్నాడు. ఈ ఘటన ఒడిశా లోని జైపూర్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. రామచంద్ర, సీత భార్యాభర్తలు. అయితే ఓ రోజు రామచంద్ర అన్నం పెట్టమని భార్య సీతను ప్రేమగా అడిగాడు. అయితే భార్య సీత అప్పుడు అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో ఇక భర్తకు అన్నం పెట్టలేకపోయింది. దీంతో అప్పటి నుంచి భర్త రామచంద్ర భార్యపై అలిగాడు. ఏకంగా 42 ఏళ్లుగా అటుకులు ఛాయ్ మాత్రమే తింటున్నాడు. అయితే ఇలా భార్య వండిన అన్నం తినట్లేదు కానీ భార్యతో మాత్రం అన్యోన్యంగానే ఉంటున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: