కావాల్సిన ప‌దార్ధాలు:
రొయ్యలు- పావు కేజీ
పసుపు- అర టీస్పూన్‌


ఉప్పు- తగినంత
ఉల్లిపాయ ముక్కలు- 2
మైదా- 1 టీస్పూన్‌


కారం- 1 టీస్పూన్‌
గరం మసాల పొడి- అర టీస్పూన్‌
కార్న్‌ఫ్లోర్‌- ఒకటిన్నర టీస్పూన్‌


అల్లం వెల్లులి పేస్ట్‌- ఒక టీస్పూను
మిరియాల పొడి- అర టీస్పూను
కరివేపాకు- 2 రెమ్మలు


నూనె- డీప్‌ ఫ్రైకి తగినంత
కొత్తిమీర- కొద్దిగా
గుడ్డు- 1


పచ్చిమిర్చి- 3
నిమ్మకాయ- 1


తయారీ విధానం:
ముందుగా రొయ్యలను నిమ్మకాయ రసం, ఉప్పుు, పసుసు వేసి బాగా కలిపి నీటితో కడిగి పక్కన పెట్టుకోవాలి. కడిగిన రొయ్యల్లో కొంచెం ఉప్పుు, మిరియాల పొడి, మైదా, కార్న్‌ఫ్లోర్‌, ఎగ్‌ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టౌ పై కడాయి పెట్టి నూనె వేసుకుని వేడి చేసి ఒక్కో రొయ్యని తీసుకొంటూ నూనెలో వేసుకోవాలి. వీటిని పది నిమిషాల పాటు బాగా వేగనివ్వాలి. వీటిని ఒక ప్లేటులోకి తీసి పక్కన పెట్టుకోవాలి.


మరో కడాయిలో కొంచెం నూనె వేసుకుని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ వేసుకుని వేయించాలి. దీంట్లో చిటికెడు పసుపు, అర టీస్పూన్‌ కారం, ఉప్పు చిటికెడు వేసి బాగా కలపాలి. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న రొయ్యలను వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో అర టీస్పూన్‌ గరం మసాలా వేసి రొయ్యలకు బాగా పట్టేలా తిప్పాలి. చివర్లో కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసి  స్టౌ ఆఫ్ చేయాలి. అంతే రొయ్య‌ల ఫ్రై రెడీ..!  


మరింత సమాచారం తెలుసుకోండి: