ఇండియన్ క్రికెట్ టీం లో దూకుడుగా ఉంటూ దూకుడుగా అదే వ్యక్తుల్లో విరాట్ కోహ్లీ ఒకరు. జట్టుకు అవసరమైన సమయంలో ధీటుగా ఆడి విజయం సాధిస్తుంటాడు. అందుకే విరాట్ కోహ్లీ కి జట్టులో పించ్ హిట్టర్ గా పేరుంది. ఇప్పుడు విరాట్ కోహ్లీకి జట్టులోని ఒకరు ప్రత్యర్థిగా మారారు.
అదెవరో కాదు వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ. అవును. రోహిత్ శర్మ జట్టులో తనదైన దూకుడును ప్రదర్శిస్తున్నాడు. ఈ వరల్డ్ కప్ లో భారీ స్క్రోర్ చేశాడు. ఆడిన 8 మ్యాచ్ లలో 5 శతకాలు, ఒక అర్ధ సెంచరీ సాధించాడు. ఒక వరల్డ్ కప్ లో ఇన్ని సెంచరీలు చేసిన ఆటగాడు మరొకరు లేరు.
ప్రస్తుతం ఇండియా సెమిస్ కు చేరుకుంది. రోహిత్ మరో సెంచరీ చేస్తే...సచిన్ రికార్డును బ్రేక్ చేస్తాడు. ఎలా అంటే..సచిన్ అన్ని వరల్డ్ కప్ మ్యాచ్ లలో కలిపి ఆరు సెంచరీలు చేశాడు. రోహిత్ శర్మ వరల్డ్ కప్ లో 6 సెంచరీలు చేసి సచిన్ రికార్డు ను సమం చేశాడు. ఇప్పుడు ఇంకో సెంచరీ చేస్తే చాలు.. వరల్డ్ రికార్డ్ అవుతుంది.
కోహ్లీ మైదానంలో ఎంత దూకుడుగా ఆడతాడో.. రోహిత్ కూడా క్రీజ్ లో కుదురుకుంటే అదే దూకుడును ప్రదర్శిస్తాడు. సెంచరీ చేయడం అంటే రోహిత్ కు చాలా సింపుల్ అయ్యింది. క్లాస్ గా ఆడుతూ.. సెంచరీలు బాదేస్తున్నాడు. రోహిత్ క్రీజ్ లో ఉన్నాడు అంటే సెంచరీ చేయడం ఖాయం అనే విధంగా మారిపోయింది. మరి ఈ యువ ఆటగాడు న్యూజిలాండ్ తో జరిగే సెమిస్ లో ఎలా ఆడతాడో చూడాలి.