బుల్లితెర నటి, టీవీ యాంకర్‌ శాంతి( విశ్వశాంతి) అనుమానస్పదంగా మృతి చెందారు. శాంతిగా బుల్లితెర‌పై పాపుల‌ర్ అయిన విశ్వ‌శాంతిది విశాఖ‌ప‌ట్నం జిల్లా స్వ‌స్థ‌లం. ఆమె హైద‌రాబాద్‌లోని ఎస్సార్ న‌గ‌ర్‌లోని ఇంజ‌నీరింగ్ కాల‌నీలో నివాసం ఉంటున్నారు. అయితే శాంతి గ‌త నాలుగు రోజుల నుంచి బ‌య‌ట‌కు రావ‌డం లేదు. దీంతో అనుమానం వ‌చ్చిన స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం ఇవ్వ‌గా వారు వ‌చ్చి త‌లుపులు ప‌గ‌ల‌గొట్టి చూడ‌గా ఆమె లోప‌ల మృతి చెంది ఉన్నారు.

 

శాంతి ఎలా ? చనిపోయిందనేదానిపై చుటుపక్కల వారిని విచారిస్తున్నారు. ఇంట్లో తనిఖీలు చేసి ఆమె ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. సీసీ పుటేజీలను పరిశీలించారు. పోస్టు మార్టం నిమిత్తం ఆమె మృత‌దేహాన్ని ఆసుప‌త్రికి త‌ర‌లించిన పోలీసులు ఆమె ఎలా ?  చ‌నిపోయింద‌న్న‌దానిపై విచార‌ణ చేప‌డ‌తామ‌ని చెప్పారు. శాంతి ఎందుకు ?  చిన‌పోయింది ? అన్న‌ది ఎవ్వ‌రికి క్లారిటీ లేదు. ఆమె మూడేళ్లుగా అక్క‌డే ఉంటుంద‌ని చెపుతున్నారు. శాంతి మరణంతో పలువురు టీవీ నటులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: