పిల్ల‌ల‌కు చీమ‌కుట్టినా త‌ల్ల‌డిల్లిపోయే త‌ల్ల‌లున్నా ఈలోకంలోనే.. క‌న్న‌బిడ్డ‌ల‌ప‌ట్ల అత్యంత క‌ర్క‌శంగా వ్య‌వ‌హ‌రించే వారు కూడా ఉన్నారు. కోరిక తీర్చుకోవ‌డానికి అడ్డుగా ఉన్నాడ‌ని క‌న్న‌కొడుకునే చంపింది ఓ త‌ల్లి..! ఈ దారుణ‌మైన ఘ‌ట‌న త‌మిళ‌నాడులో జ‌రిగింది. కోయంబత్తూరులోని కోవై కోవిల్‌ మేడు ప్రాంతంలో నివసిస్తున్న దివ్య(30)కు కొన్నేళ్ల కింద‌ట‌ ఓ వ్యక్తితో వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలున్నారు. అయితే మనస్పర్థల కారణంగా భార్యాభ‌ర్త‌లు ఇటీవ‌ల విడిపోయారు. అప్ప‌టి న ఉంచి దివ్య ఇద్దరు పిల్లలతో కలిసి తుడియలూరులో ఉంటోంది. ఈ క్ర‌మంలో ఆమెకు అదే ప్రాంతానికి చెందిన యువ‌కుడు రాజదురైతో అక్ర‌మ సంబంధం ఏర్ప‌డింది. ఆ త‌ర్వాత ఇద్ద‌రూ కలిసి సుమారు 20 రోజుల క్రితం అదే ప్రాంతంలోని సాయిబాబా కాలనీకి మకాం మార్చారు. అప్ప‌టి నుంచి ఇద్ద‌రూ సహజీవనం చేస్తున్నారు. 

 

అయితే.. దివ్య రాజ‌దురైతో రాసలీలలు సాగించే సమయంలో కొడుకు అభిషేక్‌ను బయటకు పంపుతూ ఉండేది. మంగళవారం కూడా ఆమె ప్రియుడితో శారీరకంగా కలిసిన సమయంలో అమ్మా.. ఆక‌లి అవుతుందంటూ అభిషేక్(6) ఏడ్చాడు. దీంతో ఆగ్ర‌హానికి గ‌రైన దివ్య కొడుకును తీవ్రంగా కొట్ట‌డంతో అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. దీంతో కంగారుపడిన దివ్య, రాజదురై బాలుడిని వెంట‌నే 108 వాహనంలో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే పాపం ప్రాణాలు కోల్పోయాడు. ఏం జ‌రిగింద‌ని వారిని 108 సిబ్బంది అడగ్గా ప్రమాదంలో బాలుడు గాయపడ్డాడని వారు చెప్పారు. అయితే.. వారి ప్ర‌వ‌ర్త‌న‌తో అనుమానం వ‌చ్చిన 108 సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు దివ్య, రాజదురైని వెంట‌నే అదుపులోకి తీసుకుని విచారించగా విష‌యం మొత్తం చెప్పారు. బాలుడు అభిషేక్ తనను తండ్రిగా అంగీకరించలేదన్న కోపంతోనే దివ్యతో కలిసి తాను హత్య చేసినట్లు రాజదురై పోలీసులకు చెప్పాడు. దీంతో పోలీసులు ఆ ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దివ్య మూడేళ్ల‌ కుమార్తె శిశు సంరక్షణ కేంద్రానికి తరలించారు. ఈ ఘ‌ట‌న స్థానికంగా క‌ల‌క‌లం రేపింది. ఛీ..ఛీ.. అక్రమ సంబంధం కోసం కన్నబిడ్డనే చంపుకుంటుందంటూ దివ్యపై స్థానికులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: